Home » AP Police
రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (DGP Harish kumar Gupta) తెలిపారు. 301 సమస్యాత్మాక ప్రాంతాలను గుర్తించి సోదాల నిర్వహించినట్లు తెలిపారు. సోదాల్లో ఎలాంటి పత్రాలు లేని 1104 వాహనాలు జప్తు చేసినట్లు చెప్పారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో(AP Elections 2024) ఓడిపోతామనే భయంతోనే వైఎస్సార్సీపీ (YSRCP) కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కూటమి గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు.
తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) సోమవారం ఎన్నికల సంఘానికి (Election Commission) లేఖ రాశారు. విశాఖ కంచరపాలెంలో తమకు ఓటు వేయలేదన్న కారణంతో ఓ కుటుంబంపై వైసీపీ నేతలు దాడి చేసిన ఘటనను ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా దృష్టికి తీసుకొచ్చారు.
Andhrapradesh: ఎన్టీఆర్ జిల్లా మొత్తం 144 సెక్షన్, పోలీసు యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉందని సీపీ పీహెచ్డీ రామకృష్ణ వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోలు బంకుల్లో లూజ్ పెట్రోల్ అమ్మకాలపై నిషేధం విధించామన్నారు. బాణాసంచా తయారీదారులకు, షాపులకు నోటీసులు ఇస్తున్నామని తెలిపారు. స్ట్రాంగ్ రూంలకు రెండు కిలోమీటర్ల దూరం వరకూ రెడ్ జోన్ ఉందన్నారు.
Andhrapradesh: బాధితుల గొంతు వినిపించిన మీడియా స్వేచ్ఛపై కంచర్లపాలెం పోలీసులు దాడి చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. స్వామి భక్తి కోసం అక్రమ కేసులు పెడుతున్న కంచర్లపాలెం పోలీసుల తీరును దేశం మొత్తం చూస్తోందన్నారు. తప్పుడు కేసులు పెట్టిన కంచర్లపాలెం పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
Andhrapradesh: ఏపీ ఎన్నికల్లో పోలీసుల తీరు ఏవిధంగా ఉందో అందరికీ తెలిసిందే. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారంటూ ఇప్పటికీ డీజీపీ స్థాయి నుంచి ఎస్ఐ వరకు ఎన్నికల సంఘం వేటు వేసిన విషయం తెలిసిందే. ఈసీ చర్యలతో పోలీసుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో పోలీసు అధికారుల వరుస బదిలీలు, సస్పెన్షన్లు రాష్ట్రంలో హాట్టాపిక్గా నిలిచాయి.
రాష్ట్రంలో పోలింగ్ రోజు(ఈ నెల 13న).. (AP Elections) ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలను రాష్ట్ర పోలీసు యంత్రాంగం చాలా తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు..
ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై (MLA Rachamallu Sivaprasad Reddy) పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రొద్దుటూరు ఒన్ టౌన్ సీఐ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. శివప్రసాద్ రెడ్డి బావమరిది బంగారు మునిరెడ్డిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐను బెదిరించి, విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.
ఏపీలో వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో దాడులు పెరిగిపోయాయి. ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) జరిగిన పోలింగ్ రోజు, మరుసటి రోజు నుంచి కూడా వైసీపీ మూకలు అల్లర్లకు పాల్పడుతున్నాయి. మరోసారి అధికారంలోకి ఎలాగైనా రావాలని పెద్ద ఎత్తున కుట్రలకు పాల్పడుతోంది.
నిన్న ఎయిర్ పోర్ట్లో అన్యాయంగా ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేష్ను అరెస్టు చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమ (Devineni UMA) అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై లోకేష్ అభిప్రాయాలు వ్యక్తం చేయడం తప్పా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి అవినీతిపై లోకేష్ తన అభిప్రాయాలు చెప్పారని అన్నారు.