Home » AP Politics
ఏపీలో ఐదేళ్లలో వైసీపీ (YSRCP) నేతలు పెట్రేగిపోయారు. వారు సృష్టించిన అరాచకం, దాడులు అన్ని ఇన్ని కావు. సామాన్యులపై దాడులు చేస్తూ ఈ ఐదేళ్లలో ఎన్నో రకాలుగా భయభ్రాంతులకు గురిచేశారు.
ప్రజలిచ్చిన విరాళాలతో పోటీచేసి గెలిచిన పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానుభావులు ఏలిన నియోజకవర్గమది. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు డబ్బే ప్రధానమైంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నగదు వెదజల్లాయి. ఒక ఓటు సుమారు రూ.3 వేల వరకూ పలికిందంటే ఈ నియోజకవర్గం ఎంత ఖరీదైందో తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల(Andhra Pradesh Elections) నేపథ్యంలో జగన్(YS Jagan) సర్కార్ విపరీత పోకడల కారణంగా మొత్తం పోలీసు శాఖపైనే మచ్చ పడింది. ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం పోలీసు యంత్రాంగాన్ని అడ్డగోలుగా వాడుకోవాలన్న వ్యూహం బెడిసికొట్టింది. దీని ఫలితంగా..
రాష్ట్రంలో పోలింగ్ అనంతరం వైసీపీ రౌడీల దాడులను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలం అవుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) వ్యాఖ్యానించారు. తాజాగా ఈ హింస ప్రశాంతమైన విశాఖకు కూడా చేరిందని అన్నారు. ఇలా అనేకం జరుగుతున్నా వైసీపీ(YCP) మూకలు చేస్తున్న దాడుల విషయంలో పోలీసులు(police) ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఏపీలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని చంద్రబాబు వెల్లడించారు.
రాష్ట్రంలో అధికార మార్పిడి తథ్యమని అధికారులందరికీ తెలిసిపోయిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) వ్యాఖ్యానించారు. అందుకోసమే కార్యాలయాల్లోని రికార్డులు తరలించడానికి సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో కార్యాలయాల్లోని రికార్డులు తరలించడానికి, మార్చడానికి వీల్లేదని ఆర్డర్ ఇవ్వాలని గవర్నర్ను కోరినట్లు వర్ల రామయ్య తెలిపారు.
తనపై అనర్హత వేటు కక్షపూరిత చర్య అని ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి తెలిపారు. మౌఖికంగా తన వివరణ తీసుకోకుండానే వేటు వేశారన్నారు. ఈ వేటును బీసీలపై తీసుకున్న చర్యగా భావిస్తున్నానన్నారు. ఎమ్మెల్సీ పదవి తనకు వ్యక్తిగతంగా ఇచ్చిన పదవి కాదన్నారు. తన బీసీ వర్గాలకు ఇచ్చిన పదవి అని పేర్కొన్నారు. చైర్మన్పై ఒత్తిడి తీసుకొచ్చి తనపై వేటు వేయించారన్నారు.
తెలుగుదేశం కూటమి కోసం ప్రచారం చేయడానికి రాష్ట్రానికి వచ్చిన ప్రవాసాంధ్రులకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ కృషి ఎనలేనిది’ అని కొనియాడారు. ఇక ముందు తనలో పూర్తిగా మారిన చంద్రబాబును చూస్తార ని
పోలింగ్ రోజు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన వైసీపీ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కళ్లకుంట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి
ఏపీ(AP)లో ఇటివల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కీలక అధికారులైన సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ కుమార్ విశ్వజిత్ సహా పలువురు అధికారుల సమక్షంలో జరిగిన భేటీ తాజాగా పూర్తైంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించాల్సిన అంశాలపై అధికారులు ఈ అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
న్నికల నిబంధనలను సీఎం (అపద్ధర్మ) జగన్ రెడ్డి సెక్యూరిటీ తుంగలో తొక్కారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఎం సెక్యూరిటీ సిబ్బంది పార్టీ నిర్వహించారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఫిర్యాదు చేశారు.