Home » BJP
రాష్ట్రంలో పోలింగ్ ముగిసి వారం దాటిపోయింది. మరో రెండు వారాలకు గాని ఫలితాలు వెలువడవు. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగనుంది.
దేశంలో పెనుమార్పు సంభవిస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు అండగా ఉన్నారన్నారు. అయిదో దశలో భాగంగా సోమవారం ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 స్థానాలకు......
దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని పార్టీల కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని ప్రధాని మోదీ అన్నారు. దక్షిణాది భారీ విజయాలతో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో కలిపి 400 సీట్లు దాటుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘మరోసారి మోదీ సర్కారు...
తెలంగాణలో కేసీఆర్ను ఓడించినట్లే, ఏపీలో జగన్ను అక్కడి ప్రజలు ఓడించడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ను అహంకారం ఓడించిందని.. ఇప్పుడు జగన్ విషయంలోనూ అదే జరగబోతోందని అన్నారు. జగన్ ఇచ్చిన ఉచితాలకు ఆయన ఇంట్లో కూర్చుని గెలవాలని.. కానీ అక్కడ అంత సీన్ లేదని పేర్కొన్నారు. అభివృద్ధిపై దృష్టి పెడితే మరోలా ఉండేదని అన్నారు.
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ అయిన ఇచ్చాడా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) ప్రశ్నించారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బ్లాక్ మెయిలర్ తీన్నార్ మల్లన్న కావాలో.. బీఆర్ఎస్ గోల్డ్ మెడల్ ఏనుగుల రాకేష్ రెడ్డి కావాలో ఆలోచించుకోవాలని అన్నారు.
తాను ప్రవేశపెట్టిన స్వేరో అనే పదం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చేరిందని నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) తెలిపారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసులు ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి కావాలో.. విద్యార్థుల సమస్యలపై పోరాడే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి లాంటి వ్యక్తి కావాలో మీరే ఆలోచించాలని కోరారు.
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. అందరి దృష్టి కౌంటింగ్పైనే నెలకొంది. జూన్4 కోసం ఏపీ ప్రజలు నిరీక్షిస్తున్నారు. రాజకీయ పార్టీల నాయకులు మాత్రం ఓట్ల లెక్కింపు కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పోటీచేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు గ్రామాల వారీగా లెక్కలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ఇచ్చిన ఉచితాలకు.. ఆయన ఇంట్లో కూర్చుని గెలివాలని కాని ఆ పరిస్థితి లేదని చెప్పారు.
Telangana: ఈనెల 27న ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని... బీజేపీ అభ్యర్థిగా 40 ఏళ్లుగా సిద్ధాంతాన్ని నమ్ముకుని ఎత్తిన జెండా దింపని గుజ్జుల ప్రేమెందర్ రెడ్డిని ఎమ్మెల్సీ బరిలో నిలిపామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ఆనాడే ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించినా నేటికీ అమలు చేయకపోవడం పట్ల వారు బాధతో ఉన్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు చెల్లింపు విధానంతో మళ్ళీ ఆర్టీసీని దివాలా తీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
Telangana: మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలని ప్రజలు భావిస్తున్నారని బీజేపీ నేతలు ఈటల రాజేందర్, బీబీ పాటిల్ అన్నారు. కోదాడలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో వీరు పాల్గొని ప్రసంగించారు. నల్గొండలో బీజేపీకి డిపాజిట్ రాదు అనేది అవగాహన లేనివారు అహంకారంతో మాట్లాడేవని అన్నారు. ఎన్ని డబ్బులు పెట్టినా ధర్మం న్యాయం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.