Home » Business news
మీరు ఎక్కువగా జోమాటో(Zomato) నుంచి ఫుడ్(food) ఆర్డర్ చేస్తారా. అయితే మీకో గుడ్ న్యూస్. ఎందుకంటే ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ కంపెనీ జొమాటో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం మీరు ఈ యాప్లో ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే మీకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయా వంటకాలను సూచిస్తుంది.
భారతదేశ ఆర్థిక వృద్ధి పనితీరు చాలా బాగుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ నిపుణుడు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఓ వైపు చైనా(china)లో పెట్టుబడులు(investments) తగ్గుముఖం పడుతుండగా, అనేక పాశ్చాత్య దేశ కంపెనీలకు ప్రస్తుతం భారత్ ప్రత్యామ్నాయ పెట్టుబడి గమ్యస్థానంగా మారిందని తెలిపారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) వరుసగా రెండో రోజు(మే 17న) భారీ లాభాలతో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 253 పాయింట్లు లాభపడి 73917 వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు లాభపడి 22466 పాయింట్ల వద్దకు చేరుకుంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 139 పాయింట్లు వృద్ది చెంది 48,116 వద్ద ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ ఏకంగా 452 పాయింట్లు పెరిగి 51,605 పాయింట్ల వద్ద స్థిరపడింది.
దేశంలో ప్రస్తుతం పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక మంది క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల(electric bikes) వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఇంధన వాహనాల అమ్మకాలపై ప్రభావం చూపుతుండగా..మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్(electric bike) తీసుకోవాలని భావిస్తున్నట్లైతే ముందుగా మీరు కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చుద్దాం.
మనదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ అరుదైన ఘనతను దక్కించుకున్నారు. తాజాగా ప్రపంచంలోని సూపర్ రిచ్ క్లబ్(worlds super rich club)లో 15 మంది సభ్యులు చోటు దక్కించుకోగా వారిలో ముఖేష్, అదానీ చేరారు. ముఖేష్ అంబానీ తర్వాత గౌతమ్ అదానీ మరోసారి 100 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరారు.
Gold and Silver Rates Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ గత కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్న పుత్తడి ధరలకు ఇవాళ బ్రేక్ పడింది. రివర్స్ గేర్ వేసుకుని.. రూ. 270 తగ్గింది. శుక్రవారం నాడు 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ 10 గ్రాములకు రూ. 270 తగ్గగా.. 22 క్యారెట్స్ గోల్డ్పై రూ. 250 తగ్గింది.
లోక్సభ 2024 ఎన్నికలకు(lok sabha elections 2024) ముందే కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ క్రమంలో గుండె, కాలేయం, మధుమేహం సహా అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందుల ధరలను(medicines rates) తగ్గించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock markets) గురువారం (మే 16న) భారీ లాభాలతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీ తర్వాత గురువారం దేశీయ మార్కెట్లలో బలమైన ప్రారంభం మొదలై, సెన్సెక్స్ 677 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్ల లాభంతో ముగిశాయి.
నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (NSSO) పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు గురువారం ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం రేటు జనవరి-మార్చి మధ్య కాలంలో 6.7 శాతానికి తగ్గింది. ఏడాది క్రితం ఇదే సమయానికి ఈ రేటు 6.8 శాతంగా ఉండింది.
ఆన్లైన్లో కిరాణా, కూరగాయలు, పండ్లు సహా పలు ఉత్పత్తులను విక్రయించే బ్లింకిట్(Blinkit) సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మీరు ఈ ప్లాట్ ఫాంలో కూరగాయలు కొనుగోలు చేస్తే కొత్తిమీర(coriander) ఉచితంగా పొందవచ్చు. అవును మీరు విన్నది నిజమే.