Home » CBN
: ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఓ వ్యకి హైదరాబాద్లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో నాలుక కోసుకున్నారు. ఏపీలోని ఏలూరు జిల్లా పోలవరం మండలం, గూటల గ్రామానికి చెందిన చేడల మహేశ్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
సార్వత్రిక ఎన్నికలలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితిని కల్పించాలని, పోలింగ్ శాతం పెరిగేలా కృషి చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. ఓటమి భయంతో వైసీపీ ఊహించని స్థాయిలో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉన్నందున, పోలింగ్ చివరి నిమిషం వరకు పూర్తి స్థాయి అప్రమత్తతతో ఉండాలని నిర్దేశించారు.
ప్రధాని మోదీ(PM Modi) మే 14న ఉత్తరప్రదేశ్లోని వారణాసి(Varanasi) లోక్ సభ స్థానానికి నామినేషన్ సమర్పించనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమిలోని ప్రధాని పార్టీల నేతలను మోదీ ఆహ్వానించారు.
2019లో పరిస్థితి వేరు.. ఇప్పుడు వేరు. ఆ సమయంలో ఒక్క ఛాన్స్ అని ప్రజలను జగన్ అడిగారు. సరేలే అని అవకాశం ఇచ్చి ఉంటారు. ఛాన్స్ ఇస్తే ఏం చేశాడో ఆ జనమే చూశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజా వేదిక కూల్చి తన మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నాడు. తర్వాత విపక్ష నేతలను టార్గెట్ చేశాడు. తొలినాళ్లలో కరెంట్ సమస్య ఎక్కువగా ఉండేది. రహదారుల సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికి రహదారుల మరమ్మతులు జరగలేదు. అందుకే ఈ సారి కూటమి వైపు జనాలు మొగ్గు చూపే అవకాశం ఉంది.
ఏపీలో ఎన్నికలకు సరిగ్గా ఐదు రోజులు సమయం మాత్రమే ఉంది. గెలుపు మాదేనంటూ ఎన్డీయే కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. వికసిత ఆంధ్రప్రదేశ్ నినాదంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు.. మరోవైపు అధికార వైసీపీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతం టార్గెట్ చేస్తోంది. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రణక్షేత్రంలో ఎన్డీయే కూటమి విజయవకాశాలు ఎలా ఉన్నాయి. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడం వలన తెలుగుదేశం, జనసేన జోడికి లాభమా.. నష్టమా..
ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్మోహన్రెడ్డి విజయవంతంగా గోదావరిలో ముంచేశారు. చంద్రబాబు హయాంలో ఉవ్వెత్తున సాగిన పనులను రివర్స్ టెండరింగ్తో బొంద పెట్టేశారు.
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండగా.. వైసీపీ తన అధికారాన్ని ఉపయోగించి విపక్షాలపై కక్షసాధింపులకు పాల్పడుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా పోలింగ్కు వారం రోజుల ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు, యువనేత లోకేష్పై కేసు పెట్టడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అధికారం ఉందనే అహంకారం, తాను ఏం చేసినా చెల్లుతుందన్నట్లు వైసీపీ అధినేత జగన్ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఓటరు తిరగబడితే ఏమవుతుంది.. ఫలితం తారుమరవుతుంది.. అందుకే ఎన్నికల సమయంలో ఓటర్లే దేవుళ్లు.. ఐదేళ్ల పాటు నాయకుల చుట్టూ ప్రజలు తిరిగితే.. ఎన్నికల ముందు మాత్రం నాయకులే ఓటర్ల ముందుకు వస్తారు. మాకు ఓటు వేయండి.. మీ సమస్యలన్నీ తీర్చేస్తామంటూ హామీలిస్తారు. కొంతమంది ప్రజలు నాయకుల మాటలు నమ్మి ఓటు వేస్తే.. మరికొంతమంది ఓటు ఎవరో ఒకరికి వేయాలి కదా అని ఓటు వేస్తుంటారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సాధారణంగా చాలామంది ప్రజల్లో నాయకులు, పార్టీలపై కోపం ఉంటుంది. అందుకే ఎన్నికల్లో ఫలితాలు ఊహించిన విధంగా ఉండవు. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కోలా ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటరు వైసీపీ ప్రభుత్వంపై తమ అసంతృప్తిని బయటపెడుతున్నారు.
ఎన్నికల వేళ ఏపీలో చిత్ర, విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఓటర్ల నాడిని తెలుసుకునేందుకు గ్రామాల్లో తిరుగుతున్న సర్వే సంస్థల ప్రతినిధులకు ఓటర్లు షాక్ ఇస్తున్నారట. ఓటర్ల నాడిని పట్టుకోవడం సర్వే సంస్థలకు పెద్ద సవాలుగా మారినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని.. ఈ ఎన్నికల్లోనే ఓటర్ల నాడి బయటపడటం లేదట.
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుుతున్న కొద్ది ప్రధాన రాజకీయపార్టీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. గెలుపే లక్ష్యంగా ఎన్డీయే కూటమి, వైసీపీ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారానికి భారీగా పార్టీ కార్యకర్తలు, అభిమానులతో పాటు స్థానికులు వస్తున్నారు. మా అభ్యర్థిని గెలిపించాలంటూ ఓటర్లను కోరుతున్నారు. అయితే ఈ ప్రచారానికి వస్తున్న వారిలో ఎంతమంది తమ పార్టీకే ఓటు వేస్తారో అభ్యర్థులకు అర్థం కావడంలేదట.