Home » Chittoor
తిరుపతి: 125 నుంచి 150 స్థానాల్లో కూటమి గెలుస్తుందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబంతో సహా అభిషేక సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
Andhrapradesh: వైసీపీని ప్రజలు తారు డబ్బాలో ముంచేశారని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతమైన ఏపీని రావణకాష్టంగా మార్చారన్నారు. వైసీపీని నమ్ముకుని చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు తమ కేరీర్లో మచ్చ తెచ్చుకున్నారని... అందుకే పాత ఎఫ్.ఐ.ఆర్ను కూడా మార్చమని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందన్నారు.
Andhrapradesh: తిరుపతిలో ఎంతో వైభవంగా జరిగే తాతయ్యగుంట గంగమ్మ జాతరకు నేడు (మంగళవారం) చాటింపు జరుగనుంది. ఏపీలో జరిగే జాతరలో గంగమ్మ జాతర ఒకటి. తిరుపతి గంగమ్మ జాతరకు ఎంతో విశిష్ట ఉంది. ఏడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. తిరుపతి గ్రామదేవత తాతాయ్యగుంట గంగమ్మకు ప్రతీ ఏటా జాతర చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతీ ఏటా మే నెలలో ఏడు రోజుల పాటు జాతర నిర్వహించటం జరుగుతుంది.
Andhrapradesh: ఏపీలో పోలింగ్ మొదలవక ముందే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏజెంట్లపై అధికార పార్టీ నేతలు దాడులకు తెగబడుతున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో ఏకంగా టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ చేశారు వైసీపీ నేతలు. అది కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మండలంలోనే.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) శనివారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో వైకుంఠం ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని లఘు దర్శనంలో దర్శించుకున్నారు.
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్ (Ramachandra Yadav)పై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులపై ఏపీ హైకోర్టు (AP High Court)లో రామచంద్రయాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. తనను ఎన్నికల ప్రచారం చేసుకోనివ్వకుండా ప్రభుత్వం అడ్డుపడుతుందని హైకోర్టులో ఆయన పిటీషన్ వేశారు.
జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) అరాచకాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. చిత్తూరు జిల్లా నుంచి తాను, కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్రకు సీఎంగా పనిచేశామని గుర్తుచేశారు. పుంగనూరులో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ’’ప్రజాగళం‘‘ వేదికగా సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.
‘బస్సులు పెడ్తున్నం.. బేగి బయల్దేరండి’ అంటూ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఓటు హక్కు ఉన్న హైదరాబాద్ వాసులకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల నుంచి ఫోన్కాల్స్ వెల్లువెత్తుతున్నాయి..
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్కు కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాలు ప్రచారంలో స్పీడ్ పెంచారు. మరోవైపు.. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతోంది. దీంతో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సభలో అపశృతి చోటు చేసుకుంది. శనివారం జిల్లాలోని పలమనేరులో సీఎం జగన్ సభ నిర్వహించారు. అయితే జగన్ సభకు హాజరైన ప్రజల్లో పలువురు అస్వస్థతకు గురయ్యారు. సభకు వచ్చిన జనానికి వైసీపీ శ్రేణులు చల్లని పానీయాలు పంపిణీ చేశారు. అయితే వీటిని తాగిన పలువురకి అనారోగ్యం పాలయ్యారు. వాంతులు అవడంతో వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.