Home » CM Jagan
తెలంగాణలో కేసీఆర్ను ఓడించినట్లే, ఏపీలో జగన్ను అక్కడి ప్రజలు ఓడించడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ను అహంకారం ఓడించిందని.. ఇప్పుడు జగన్ విషయంలోనూ అదే జరగబోతోందని అన్నారు. జగన్ ఇచ్చిన ఉచితాలకు ఆయన ఇంట్లో కూర్చుని గెలవాలని.. కానీ అక్కడ అంత సీన్ లేదని పేర్కొన్నారు. అభివృద్ధిపై దృష్టి పెడితే మరోలా ఉండేదని అన్నారు.
సీఐడీ డీజీని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతల బృందం సోమవారం కలిసింది. వైఎస్సార్సీపీ (YSRCP) కార్యకర్తలు టీడీపీ ముసుగులో దుష్ప్రచారం చేస్తున్నారని ఆధారాలతో సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో(AP Elections 2024) ఓడిపోతామనే భయంతోనే వైఎస్సార్సీపీ (YSRCP) కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కూటమి గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓటమి తథ్యమని మరోమారు స్పష్టం చేశారు. వైయస్ జగన్ ప్రభుత్వానికి ఈ ఎన్నికలతో నూకలు చెల్లిపోతాయని చెప్పేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అధికార వైసీపీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నాయి.
వైసీపీ (YSRCP) ప్రభుత్వం వల్ల ఉద్యోగ సంఘాలు చాలా నష్టపోయాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘం ఐక్యవేదిక సంఘాల రాష్ట్ర చైర్మన్ కె.ఆర్ సూర్యనారాయణ (KR Suryanarayana) అన్నారు. ఉద్యోగుల జీపీఎస్ సొమ్మును తమకు తెలియకుండా తమ ఖాతాల నుంచి రూ. 500 కోట్లను వైసీపీ ప్రభుత్వం దొంగతనం చేసిందని ఆరోపించారు.
సీఎం, వైఎస్సార్పీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి (CM JAGAN) మేనమామ, వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి (Ravindranath Reddy) నోరు జారారు. ఆదివారం ఆయన తిరుపతిలోని వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైసీపీ అని నోరుజారారు.
విశాఖ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసు చరిత్రలోనే కొత్త అధ్యాయం నమోదైంది. ఎన్నికల విధుల్లో వైఫల్యంపై విచారణకు రాష్ట్ర పోలీస్ శాఖ ఊహించని రీతిలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటైంది.
సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుపై ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగింది. పోస్టింగ్ ఇవ్వకుండా పదవీ విరమణ చేయించేందుకు ఎత్తుగడ వేసింది. రెండవ సారి సస్పెన్షన్ను క్యాట్ కొట్టివేసింది. వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. క్యాట్ ఆదేశాలను చీఫ్ సెక్రటరీకి ఏబీ ఇచ్చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఫైల్ను ఎలక్షన్ కమిషన్కు పంపాలని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Andhrapradesh: ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని, ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి కట్టడి చేయాలని ఆదేశించందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్జీటీ ఆదేశించినా ఇసుక తవ్వకాలు ఆగడం లేదని విమర్శించారు. ఇసుకను దోచుకుని తాడేపల్లి ప్యాలెస్కు రూ. 40 వేల కోట్లు తరలిస్తున్నారని ఆరోపించారు.