Home » Congress
వరిపంటకు బోనస్(Paddy Bonus) విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై(Congress Government) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం నాడు ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసంపై షాకింగ్ పోస్ట్ పెట్టారు. ఇది ప్రజా పాలన కాదని.. రైతు వ్యతిరేక పాలన అని విమర్శలు గుప్పించారు కేటీఆర్. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు.
ప్రాణహితకు వర్షాకాలం వచ్చే వరద తగ్గుముఖం పట్టాక మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన తాత్కాలికంగా రాతికట్ట కట్టి, నదీ ప్రవాహాన్ని లక్ష్మీ పంప్హౌ్సకు మళ్లించి, అన్నారం బ్యారేజీలోకి ఎత్తిపోయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద ప్రస్తుతం నీటిని నిల్వ చేసే అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు.
: రాష్ట్రంలో రైతులు పండించే సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చే పథకాన్ని వచ్చే వానాకాలం సీజన్ నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సన్న వడ్ల రకాలను గుర్తించాల్సిందిగా వ్యవసాయ ఆధికారులను ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అనుమతితో సోమవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో కేసీఆర్ను ఓడించినట్లే, ఏపీలో జగన్ను అక్కడి ప్రజలు ఓడించడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ను అహంకారం ఓడించిందని.. ఇప్పుడు జగన్ విషయంలోనూ అదే జరగబోతోందని అన్నారు. జగన్ ఇచ్చిన ఉచితాలకు ఆయన ఇంట్లో కూర్చుని గెలవాలని.. కానీ అక్కడ అంత సీన్ లేదని పేర్కొన్నారు. అభివృద్ధిపై దృష్టి పెడితే మరోలా ఉండేదని అన్నారు.
రాజకీయాల్లో విజయం, అధికారం ఎప్పుడూ ఏ ఒక్కరి సొత్తూ కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజాతీర్పుకు కట్టుబడి సుపరిపాలన అందించాలని సూచించారు. ప్రతిపక్షం ఉంటేనే ప్రజలకు సుపరిపాలన అందుతుందన్నారు.
రాష్ట్ర ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ సర్కారు ఐదు నెలల్లోనే కుప్ప కూల్చడం బాధాకరమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం ‘డయాగ్నస్టిక్ హబ్లకు జబ్బు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. ‘లక్షలాది మంది పేదలకు ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన వైద్య పరీక్షలను అందించిన డయాగ్నస్టిక్ కేంద్రాలు ఇప్పుడు నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి.
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ అయిన ఇచ్చాడా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) ప్రశ్నించారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బ్లాక్ మెయిలర్ తీన్నార్ మల్లన్న కావాలో.. బీఆర్ఎస్ గోల్డ్ మెడల్ ఏనుగుల రాకేష్ రెడ్డి కావాలో ఆలోచించుకోవాలని అన్నారు.
తాను ప్రవేశపెట్టిన స్వేరో అనే పదం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చేరిందని నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) తెలిపారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసులు ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి కావాలో.. విద్యార్థుల సమస్యలపై పోరాడే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి లాంటి వ్యక్తి కావాలో మీరే ఆలోచించాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి (Rakesh Reddy) అన్నారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రభుత్వ ఉద్యోగాలపై రేవంత్ ప్రభుత్వ మెడలు వంచుతానని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ఇచ్చిన ఉచితాలకు.. ఆయన ఇంట్లో కూర్చుని గెలివాలని కాని ఆ పరిస్థితి లేదని చెప్పారు.