Home » CPI
గుంటూరు జిల్లా: కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వం మారే అవకాశం ఉందని, మోదీ డబుల్ ఇంజన్ అని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు.. డబుల్ కాదు కదా సింగిల్ ఇంజన్ కూడా వచ్చే అవకాశం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కామెంట్స్ చేశారు.
దేశంలో మత విద్వేషాల ద్వారా బీజేపీ పాలన సాగిస్తుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎవరిష్టం వచ్చినట్లు మతాన్ని నమ్మవచ్చని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనేక చట్టాలు తీసుకు వచ్చి మైనార్టీలను టార్గెట్ చేశారని మండిపడ్డారు. రూ. 16లక్షల కోట్ల రుణాలను కార్పోరేట్ శక్తులకోసం మోదీ మాఫీ చేశారని ధ్వజమెత్తారు. జింఖానా గ్రౌండ్ లో ఇండియా కూటమి ఆధ్వర్యం శుక్రవారం భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో సీతారాం ఏచూరి ప్రసంగించారు.
పదేళ్లుగా ప్రధానిగా ఉన్న మోదీ ఏపీకి ఏం చేశారో చెప్పాలని సీపీఐ (CPI) జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా (D.Raja) ప్రశ్నించారు. జింఖానా గ్రౌండ్ లో ఇండియా కూటమి ఆధ్వర్యం శుక్రవారం భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో రాజా ప్రసంగించారు. దేశంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తి అయ్యిందని తెలిపారు.
విజయవాడ: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ, పశ్చిమ నియోజకవర్గం సీపీఐ అభ్యర్ధి కోటీశ్వరరావుకు మద్దతుగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం కోసం బీజేపీ ఎలాంటి పనికైనా బరితెగిస్తుందని ఆరోపించారు.
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. నగరంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ల్యాండ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చాలా ప్రమాదకరమైనదని, అది అమల్లోకి వస్తే రైతులు చాలా ఇబ్బందులకు గురవుతారని అన్నారు. వెంటనే ...
Andhrapradesh: అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామని బీజేపీ జాతీయ నేత ప్రధాన కార్యదర్శి దురుషాంత్ కుమార్ గౌతమ్ క్లారిటీ ఇచ్చారని.. దేశంలో బీజేపీకి మెజార్టీ వస్తే మాత్రం కచ్చితంగా రాజ్యాంగం మారుస్తారని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఉన్న టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు రాజ్యాంగం మార్పు విషయంపై వారి వైఖరిని ఓటర్లకు చెప్పాలన్నారు.
Andhrapradesh: రెండవ దశ పోలింగ్ పూర్తయిన తర్వాత ప్రధాని మోదీలో కాన్ఫిడెన్స్ తగ్గిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా బీజేపీ 200 స్థానాలు కూడా గెలవలేదన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏ పార్టీతో పొత్తులో ఉందో తెలియడం లేదన్నారు.
సీఎం రేవంత్రెడ్డిని (CM Revanth Reddy) అరెస్టు చేస్తే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలను కూడా అరెస్టు చేయాలని సీపీఐ (CPI) తెలంగాణ కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasivarao) డిమాండ్ చేశారు. ఎన్నికల వేళల్లో ప్రతిపక్ష నేతలను జైలుకు పంపడం మోదీకి ఆనవాయితీగా మారిందన్నారు.
విజయవాడ: మే 1వ తేదీన ఇళ్ల వద్దనే సామాజిక పెన్షన్ల పంపిణీకి చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువై వడగాల్పులు వీస్తున్నాయని అందుచేత ఇళ్ల వద్దనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలన్నారు.
విజయవాడ: ఎన్డీఏతోనే వైసీపీ కాపురమంటూ మనసులో మర్మాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బయటపెట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. 1200 రోజులుగా విశాఖ ఉక్కు ఉద్యమం జరుగుతున్నా పట్టించుకోని జగన్కు ఇవాళ ఉక్కు కార్మికుల ఓట్లు గుర్తొచ్చాయా? అని ప్రశ్నించారు.