Home » Crime News
పైకి చూస్తే రిచ్గా కనిపిస్తోందని హాటల్కు వెళ్లి భోజనం చేశామంటే.. మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకున్నట్లే. ఎందుకంటే ఇటీవల కొన్ని హోటల్ యజమానులు నాణ్యత ప్రమాణాలను గాలికొదిలేశారు. కల్తీ ఆహార పదార్థాలతో ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. ఇందుకు హైదరాబాద్ నగరమే నిదర్శనం. తాజాగా...
ఇటివల ఓ పర్యాటకుడికి జరిగిన ఘటనపై అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో వాటర్ స్పోర్ట్స్ నిర్వహించిన కంపెనీకి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అయితే అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్(Swati Maliwal)పై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్ దాడి చేసిన వారం తర్వాత, ఢిల్లీ పోలీసులు(delhi police) దర్యాప్తునకు మరో అడుగు ముందుకు వేశారు. ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసులు తాజాగా సిట్(SIT)ను ఏర్పాటు చేశారు.
మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆపై బొగ్గుల కొలిమిలో సజీవ దహనం చేసిన కేసులో ఇద్దరికి మరణ శిక్ష విధిస్తూ రాజస్థాన్లోని బిల్వారాలో ఉన్న పోక్సో ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. ముద్దాయిలైన కాలూ, కన్హాలకు ఈ శిక్ష విధించిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహావీర్ సింగ్ కిష్ణావత్ చెప్పారు.
జైలుశిక్ష పడినంత మాత్రాన ఖైదీలు తమ ప్రాథమిక హక్కులను కోల్పోరని హైకోర్టు స్పష్టం చేసింది. జైల్లో హత్యకు గురైన ఖైదీ కుటుంబానికి పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఓ హత్య కేసులో 2012 నుంచి జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న మెదక్ జిల్లా టేక్మల్ మండలం కౌసంగి గ్రామానికి చెందిన కరోళ్ల వెంకయ్య.. తనకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మహారాష్ట్రలోని పూణె(pune)లో ఓ 17 ఏళ్ల మైనర్ బాలుడు ఖరీదైన పోర్షే కారు(Porsche luxury car)తో మోటార్సైకిల్ను ఢీకొట్టాడు. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఆ క్రమంలో కోర్టు అతడిని పెద్దవారిలా విచారించి పోలీసు కస్టడీకి పంపేందుకు పోలీసులు అనుమతి కోరగా, కోర్టు అందుకు నిరాకరించి నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ షరతులు ఏంటనేది ఇప్పుడు చుద్దాం.
ఇరాన్ అధ్యక్షుడు(Iran President) ఇబ్రహీం రైసీ(Ebrahim Raisi) హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడి మరణం చమురు మార్కెట్లలో అస్థిరతను కలిగిస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దీంతోపాటు పెట్టుబడిదారుల చమురు(fuel) ఉత్పత్తి, ఎగుమతులపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
ఇటివల కాలంలో సైబర్ మోసాలు(cyber crime) పెరిగిపోయాయి. గతంలో అయోధ్య రామ మందిరం సహా పలు సందేశాల పేరుతో అనేక మందిని లూటీ చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇటివల కేటుగాళ్లు దేశంలోనే ప్రముఖ బ్యాంకైన SBI పేరుతో పలువురికి సందేశాలు పంపిస్తూ దోపిడికీ పాల్పడుతున్నారు.
ఆటో డ్రైవర్ హారన్ కొట్టడం కారు డ్రైవర్కు ఇబ్బందికరంగా అనిపించింది. అంతే.. కారు డ్రైవర్తో పాటు కారులో ఉన్న అతని బంధువులు పెద్ద గలాటే సృష్టించారు. నరసాపురం మండలం తూర్పు తాళ్ళు గ్రామంలో ఆటో డ్రైవర్, కారు యజమాని మధ్య హారన్ వివాదం తలెత్తింది.
మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న కూతురు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకోలేక కన్నవాళ్లే ఆమెను హత్య చేశారు. ఆ తప్పు బయటపడకుండా ఉండాలని తమ ఒక్కగానొక్క బిడ్డ అనారోగ్యంతో మరణించిందని కూతురి అత్తింటి వారిని నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేశారు. కానీ, నిజం బయటకు రావడంతో కటకటాలపాలయ్యారు.