Home » East Godavari
ఎన్నికల వేళ రాష్ట్రప్రజలు మొత్తం రాజకీయాలపైనే ఆసక్తి చూపిస్తుంటారు. ఎక్కడ ఏం జరుగుతుందో నిషితంగా పరిశీలిస్తారు. ఏ చిన్న పొరపాటు జరిగినా అది చేసే నష్టాన్ని ఊహించలేం.. ఇలాంటి అనుభవాలు ఎన్నో స్వాతంత్య్ర భారతంలో చూశాం. అందుకే రాజకీయ పార్టీలు, నాయకులు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. నిన్నటి వరకు మనవాళ్లుగా ఉన్నవాళ్లే.. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులుగా మారిపోవచ్చు. నువ్వు సూపర్ అంటూ ప్రశంసినవాళ్లే.. వాడో వేస్ట్ అంటూ విమర్శించవచ్చు.. ఎన్నికల వేళ ఇవ్వన్నీ సాధారణ విషయాలు అయిపోయాయి.
ఓటరు తిరగబడితే ఏమవుతుంది.. ఫలితం తారుమరవుతుంది.. అందుకే ఎన్నికల సమయంలో ఓటర్లే దేవుళ్లు.. ఐదేళ్ల పాటు నాయకుల చుట్టూ ప్రజలు తిరిగితే.. ఎన్నికల ముందు మాత్రం నాయకులే ఓటర్ల ముందుకు వస్తారు. మాకు ఓటు వేయండి.. మీ సమస్యలన్నీ తీర్చేస్తామంటూ హామీలిస్తారు. కొంతమంది ప్రజలు నాయకుల మాటలు నమ్మి ఓటు వేస్తే.. మరికొంతమంది ఓటు ఎవరో ఒకరికి వేయాలి కదా అని ఓటు వేస్తుంటారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సాధారణంగా చాలామంది ప్రజల్లో నాయకులు, పార్టీలపై కోపం ఉంటుంది. అందుకే ఎన్నికల్లో ఫలితాలు ఊహించిన విధంగా ఉండవు. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కోలా ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటరు వైసీపీ ప్రభుత్వంపై తమ అసంతృప్తిని బయటపెడుతున్నారు.
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.. మెజార్టీ ఎంత.. ఏపార్టీ బలమెంత.. ఎక్కడ చూసినా ఇదే చర్చ. కొన్ని నియోజకవర్గాల్లో అయితే పక్కా గెలిచేదెవరో అక్కడి ప్రజలు బహిరంగంగానే చెప్పేస్తున్నారు. కొన్ని చోట్ల పోటాపోటీ ఉంటుందంటున్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో అయితే పక్కాగా టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు గెలుస్తారంటూ వైసీపీ నాయకులే చర్చించుకుంటున్నారు. మూడు పార్టీలు కలవడంతో బలం పెరిగిందని, మరోవైపు వైసీపీపై వ్యతిరేకంగా ఉన్న ప్రజలంతా కూటమివైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. గెలుపు కోసం ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. మేజిక్ ఫిగర్ 88 దాటేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రధానంగా 2019 ఎన్నికల్లో ఏడు జిల్లాల పరిధిలో గల 101 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ 85 స్థానాల్లో గెలుచుకుంది. దీంతో దాదాపు మేజిక్ ఫిగర్కు కావాల్సిన సీట్లను వైసీపీ 7జిల్లాల పరిధిలో సాధించింది. ఈ ఎన్నికల్లో కూడా అధికారంలోకి రావాలంటే ఈ ఏడు జిల్లాలే కీలకం కానున్నట్లు పార్టీలు లెక్కలు వేస్తున్నాయి.
Andhrapradesh: రాజమండ్రిలోని ఆంధ్రా పేపర్ మిల్కు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. గురువారం పేపర్ మిల్లు గేట్లకు యజమాన్యం తాళాలు వేసింది. దీంతో కార్మికులు గేటు బయటే వేచి ఉన్నారు. ఉన్నట్టుండి పేపర్ మిల్కు లాకౌట్ ప్రకటించడం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పేపర్ మిల్లు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Andhrapradesh: అధికార పార్టీ ప్రలోభాలకు ప్రజలు దూరంగా ఉండాలని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. బుధవారం గోపాలపురం మండలం లో విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తున్న బీజేపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ అభ్యర్థి పూరందేశ్వరికి తెలుగు మహిళలు హారతులు పట్టారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలు నియోజవర్గంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు.
ఏపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. రాజకీయ వ్యూహాలతో పాటు.. అనేక కుట్రలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎలాగైనా మెజార్టీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఎంత ప్రయత్నిస్తున్నా.. ఎన్ని వ్యూహాలు రచిస్తున్నా.. కూటమి బలం రోజురోజుకు పెరుగుతుండటంతో వైసీపీ నేతల్లో ఓటమి భయం పట్టుకుందనే చర్చ జరుగుతోంది.
తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తారు. ఈ ఉదయం 9 గంటలకు తణుకు జాతీయ రహదారి మీదుగా సిద్దాంతం బ్రిడ్జ్ నుంచి రావులపాలెం, జొన్నాడ సెంటర్, చెముడులంక, పొట్టిలంక చేరుకుంటారు.
కాకినాడ జిల్లా: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాకినాడ జిల్లా, పెద్దాపురంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. బీవీసీ లాజిస్టిక్స్కు సంబంధించిన వాహనంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న రూ. 5 కోట్ల విలువైన 8 కేజీల 116 గ్రాముల బంగారం, 46 కేజీల వెండి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అధికార వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు నిరసన సెగ తగిలింది. కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి ఆ శవాన్ని డోర్ డెలవరీ చేసిన అనంతబాబుకు దళితులు చుక్కలు చూపించారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అనంతబాబును దళితులు తరమి తరమి కొట్టారు.