Home » Education
పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సీపీజెట్ పరీక్షలను జూలై నెలలో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిలు సీపీజెట్ షెడ్యూల్ను విడుదల చేశారు. దాని ప్రకారం ఈనెల 18 నుంచి వచ్చేనెల 17వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ.500 ఆలస్య రుసుముతో జూన్ 25 వరకు, రూ.2 వేల ఆలస్యరుసుముతో జూన్ 30 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. జూలై 5వ తేదీ నుంచి సీపీజెట్ పరీక్షలు నిర్వహిస్తారు.
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలని చాలా మంది విద్యార్థులు కలలు కటుంటారు. ముఖ్యంగా అమెరికా వెళ్లి చదవుకోవాలని, అక్కడ ఉద్యోగం చేయాలని ఎంతోమంది ఆశిస్తుంటారు. అటువంటి విద్యార్థుల కోసం భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం గుడ్న్యూస్ చెప్పింది. స్టూడెంట్ వీసా స్లాట్ బుకింగ్ ప్రారంభమైనట్టు ప్రకటించింది. అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులు మే 31 వరకు స్టూడెంట్ వీసా స్లాట్ బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతి ఫలితాల కోసం దేశవ్యాప్తంగా దాదాపు 39 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఓ ప్రకటన వెలుగులోకి వచ్చింది.
తెలంగాణలో ఐసెట్ (TS ICET) దరఖాస్తులకు గడువు పొడిగించారు.మార్చి 5వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు ముగిసిన విషయం తెలిసిందే. అయితే మే 7వ తేదీ వరకు పొడిగిస్తూ ఉన్నత విద్యా మండలి అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5.08లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్లో పదో తరగతి ఫలితాలు విడుదల చేశారు.
Telangana: తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఎస్ఎస్సీ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 91.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఈసారి కూడా బాలికలదే పై చేయి. బాలికలు 93.23 ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 89.42శాతం ఉత్తీర్ణత పొందారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITలు)లో అడ్మిషన్ కోరుకునే అభ్యర్థుల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్డ్ (JEE Advanced 2024) రిజిస్ట్రేషన్ నేటి నుంచి మొదలు కానుంది. JEE కొత్త దరఖాస్తు ఫారమ్ jeeadv.ac.in అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది.
అధికారులు నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం అనంత సంకల్పం మెటీరియల్ ఇవ్వకపోవడంతో ప్రభుత్వ, జిల్లా పరిషత స్కూళ్లలో దారుణమైన ఫలితాలు వచ్చాయి. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఇతర యాజమాన్య స్కూళ్ల కంటే అత్యల్ప ఫలితాలు జడ్పీ, ప్రభుత్వ స్కూళ్లలో వచ్చాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నా యి. ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు డీసీఈబీ ద్వారా మెటీరియల్ తయారు...
Telangana: తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండర్ ఇయర్ ఫలితాలు ఈరోజు (బుధవారం) వచ్చేశాయి. ఈ ఫలితాల్లో కూడా బాలికలే పైచేయిగా నిలిచారు. ఇంటర్ ఫలితాల్లో వచ్చేయడంతో ఇక మిగిలింది పదో తరగతి పరీక్షా ఫలితాలు మాత్రమే. ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ ఎప్పుడో విద్యాశాఖ చెప్పేసింది.
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు(Telangana Inter Results) విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి విడుదల చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు((Telangana State Board of Intermediate Education) కార్యాయలంలో విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం ఈ ఫలితాలను..