Home » Harish Rao
రాష్ట్ర ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ సర్కారు ఐదు నెలల్లోనే కుప్ప కూల్చడం బాధాకరమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం ‘డయాగ్నస్టిక్ హబ్లకు జబ్బు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. ‘లక్షలాది మంది పేదలకు ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన వైద్య పరీక్షలను అందించిన డయాగ్నస్టిక్ కేంద్రాలు ఇప్పుడు నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి.
రేవంత్ రెడ్డి పాలన లాఠీ చార్జీలు, బడుగు జీవులకు జూటా మాటలులా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ను ఆయన పరామర్శించారు. రవీంద్ర కుమార్ తండ్రి కనిలాల్ ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే రవీంద్రను పరామర్శించిన అనంతరం మీడియాతో హరీష్ రావు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులపై లాఠీ చార్జి ఎప్పుడైనా చూశామా? అని ప్రశ్నించారు.
Telangana: రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలలోనే కుప్పకూల్చడం బాధాకరమని మాజీ మంత్రి హరీష్రావు వ్యాఖ్యలు చేశారు. డయాగ్నస్టిక్ కేంద్రాల్లో వైద్యులు, సిబ్బందికి పెండింగ్ జీతాల చెల్లింపుపై హరీష్రావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..
మాజీ మంత్రి హరీశ్రావుకు హైకోర్టులో నిరాశ ఎదురయింది. ఆనంద్ సినీ సర్వీసె్సకు జూబ్లీహిల్స్లో అయిదెకరాల భూమిని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఆయన 2008లో దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఆనంద్ సినీ సర్వీసె్సకు గోల్కొండ తాలూకా షేక్పేట్ గ్రామం సర్వే నెంబర్ 403లో ఎకరం రూ.8,500 చొప్పున అయిదెకరాల భూమిని కేటాయిస్తూ 2001లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 355 జారీచేసింది.
ప్రజాస్వామ్య దేశానికి దశ దిశ చూపేది ఓటు మాత్రమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Harish Rao) పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్ అంబిటాస్ పాఠశాలలో 114పోలింగ్ భూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదివారం సాయంత్రం సిద్దిపేట కోమటి చెరువు వద్ద కొద్దిసేపు ఆహ్లాదంగా గడిపారు.
పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క హామీని అమలుచేయని బీజేపీ, బీఆర్ఎ్సలకు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై ప్రశ్నించే హక్కు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
రాష్ట్ర వికాసం బీఆర్ఎ్సతోనే సాధ్యమని.. బీజేపీ, కాంగ్రె్సలను గెలిపిస్తే విధ్వంసమేనని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్తో కలిసి ఆయన మాట్లాడారు
Telangana: సిద్దిపేట అర్బన్ మండలం ఎన్షాన్ పల్లిలో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, మంత్రి కొండ సురేఖ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. ‘‘మీ బడుగు బలహీన వర్గాల బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. కేసీఆర్ సీఎం, హరీష్ రావు మంత్రి అయ్యారు అంటే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం వల్లే. నరేంద్ర మోదీ ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు.
Telangana: హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు పాల్గొని ప్రసంగించారు. హుస్నాబాద్ అంటే కేసీఆర్కు చాలా ఇష్టమని.. సెంటిమెంట్ ఉన్న ప్రాంతమని అన్నారు. వికాసం కావాలంటే వినోద్ అన్న గెలువాలని.. విధ్యంసం కావాలంటే కాంగ్రెస్, బీజేపీ గెలవాలంటూ వ్యాఖ్యలు చేశారు.