Home » Health Latest news
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ దుష్ప్రభావాలపై బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్యు) అధ్యయనం సరైన పద్ధతిలో జరగలేదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ఈ అధ్యయనం కోసం అనుసరించిన మెథడాలజీని తప్పుబట్టింది.
పొట్ట నొప్పి సర్వసాధారణమే! అలాగని నొప్పి తగ్గించే మందులు వాడుకుంటూపోతే అసలు సమస్య తిరిగి సరిదిద్దలేనంతగా ముదిరిపోవచ్చు. క్లోమగ్రంథి సమస్య అలాంటిదే!
నాడీ వ్యవస్థ కణజాలం ఆరోగ్యంగా ఉండాలంటే నాణ్యమైన కొవ్వులు ఆహారంలో చేర్చుకోవాలి. ఇందుకోసం...
చర్మపు తిత్తిలోకి పేగులు దిగిపోయి పొత్తికడుపు లేదా గజ్జల్లో హెర్నియా కనిపిస్తే వీలైనంత తొందరగా వైద్యుల్ని సంప్రతించి చికిత్స మొదలుపెట్టాలి.
ఆహారంలో సరిపడా పోషకాలున్నప్పుడే అది సమతులాహారం అవుతుంది. అందుకోసం శాకాహారులైతే రోజు మొత్తంలో 250 గ్రాముల తృణధాన్యాలు, 400 గ్రాముల కూరగాయలు, వంద గ్రాముల పండ్లు, 85 గ్రాముల పప్పుదినుసులు, 35 గ్రాముల నట్స్, 27 గ్రాముల కొవ్వులు, నూనెలు, 300 గ్రాముల పాలు/పెరుగు తీసుకోవాలి.
రోజురోజుకూ పెరుగుతున్న గుండెపోటు(heart attacks) కేసులు అనేక మందిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. యువకుల నుంచి వృద్ధుల వరకు చాలా మంది ఈ వ్యాధి బారిన పడి మృత్యువాత చెందిన సందర్భాలు ఇటివల వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో గుండెపోటు గురించి హార్వర్డ్ T.H. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనం(Harvard T.H. Chan School study) సర్వేలో కీలక అంశాలను వెల్లడించింది.
ఉదయాన్నే సాధారణ నీటికి బదులుగా ఎండుద్రాక్ష నీటిని తాగితే మ్యాజిక్ ఫలితాలు ఉంటాయి. ఎండుద్రాక్ష పోషకాల పవర్హౌస్. ఇందులో ప్రొటీన్, ఐరన్, ఫైబర్ ఉంటాయి. అలాగే విటమిన్ B6, కాల్షియం, పొటాషియం, కాపర్ కూడా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి.
శరీరానికి చాలా రకాల విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు అవసరమవుతాయి. వీటిలో ఐరన్ కూడా ముఖ్యమైనది. హిమోగ్లోబిన్ స్థాయి సరైన మోతాదులో ఉండాలంటే ఐరన్ ఖచ్చితంగా అవసరం. శరీరానికి సరిపడినంత ఐరన్ లభించకపోతే ఐరన్ లోపం ఏర్పడుతుంది. దీనివల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.
వాతావరణ మార్పుతో(Climate Change) పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ది లాన్సెట్ జర్నల్(The Lancet Journal) నివేదిక ప్రచురించింది. మైగ్రేన్, అల్జీమర్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిపై తీవ్ర ప్రభావం ఉంటుందని తేలింది.
ఆడవాళ్లకు ముఖం మీద జుట్టు పెరిగితే చాలా ఇబ్బందిగా ఫీలవుతారు. దీన్ని తొలగించడానికి పార్లర్లో వ్యాక్సింగ్ లేదా లేజర్ చికిత్స తీసుకుంటారు. ఈ చికిత్సలన్నీ తాత్కాలికమే.. వాటి ప్రభావం 15 నుండి 20 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ ముఖంపై జుట్టు కనిపించడం మొదలవుతుంది.