Home » Health tips
పొట్ట నొప్పి సర్వసాధారణమే! అలాగని నొప్పి తగ్గించే మందులు వాడుకుంటూపోతే అసలు సమస్య తిరిగి సరిదిద్దలేనంతగా ముదిరిపోవచ్చు. క్లోమగ్రంథి సమస్య అలాంటిదే!
ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎమ్ఆర్) తాజాగా 170 పేజీల ఆరోగ్య మార్గదర్శకాలతో కూడిన నివేదికను విడుదల చేసింది.
చర్మపు తిత్తిలోకి పేగులు దిగిపోయి పొత్తికడుపు లేదా గజ్జల్లో హెర్నియా కనిపిస్తే వీలైనంత తొందరగా వైద్యుల్ని సంప్రతించి చికిత్స మొదలుపెట్టాలి.
ఆహారంలో సరిపడా పోషకాలున్నప్పుడే అది సమతులాహారం అవుతుంది. అందుకోసం శాకాహారులైతే రోజు మొత్తంలో 250 గ్రాముల తృణధాన్యాలు, 400 గ్రాముల కూరగాయలు, వంద గ్రాముల పండ్లు, 85 గ్రాముల పప్పుదినుసులు, 35 గ్రాముల నట్స్, 27 గ్రాముల కొవ్వులు, నూనెలు, 300 గ్రాముల పాలు/పెరుగు తీసుకోవాలి.
వేగంగా మారుతున్న ప్రపంచం, మారుతున్న జీవన విధానంతో పాటు, ఉద్యోగాల సరళి కూడా మారిపోతోంది. ఎక్కువగా కంప్యూటర్ తెర ముందు గంటల పాటు కదలకుండా కుర్చీలో కూర్చొని చేసే ఉద్యోగాలే కనిపిస్తున్నాయి.
కొవిడ్-19 దేశీయ టీకా కొవాక్సిన్ తీసుకున్న వారిలో ఏడాది తర్వాత దుష్ప్రభావాలు ఎదురవుతున్నట్లు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం(బీహెచ్యూ) పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
బీర్లు అతిగా తాగితే ప్రమాదమని మీకు తెలుసా. రోజూ బీరు తాగుతుంటే శరీరంలో జరిగే మార్పులు, కలిగే సైడ్ ఎఫెక్ట్స్, ఎవరు ఎంత తాగాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కోపం రాని వారుంటారా చెప్పండి. కొంతమంది సిల్లీ కారణాలకు మాటామాటికీ కోపం(Angry) తెచ్చుకుంటారు. కోపం అనేది ఎమోషన్. కాబట్టి రావడంలో తప్పు లేదు. కానీ తరచూ కోపడ్డుతూ ఉంటే జరిగే అనర్థాలు మీకు తెలుసా. నిరాశ, అన్యాయం, బెదిరింపు వంటి అనేక కారణాల వల్ల కోపం వస్తుంది. నియంత్రణ లేని కోపం గుండెపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
పాలు ఆరోగ్యానికి మంచివని తెలుసు. పాలతో విటమిన్ డి, కాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా అందుతాయి. శరీరాన్ని, ఎముకలను బలంగా మారుస్తాయి. అందుకే వైద్యులు పాలు తరచూ తాగాలని సూచిస్తుంటారు. కానీ ఎక్కువ పాలు తీసుకోవడం హానికరం అని మీకు తెలుసా? పాలు అతిగా తాగడం వల్ల కలిగే నష్టాలు, రోజులో ఎంత పాలు తాగాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవి ప్రారంభమైనప్పటి నుంచి ఆసుపత్రుల్లో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు విపరీతంగా పెరిగాయట. ఈ కేసుల్లో వ్యాధిగ్రస్తులు షుగర్, బీపీలతో బాధపడుతున్నారు. ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగడంతోనే బ్రెయిన్ స్ట్రోక్(Brain Stroke) కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు. మధుమేహం, బీపీతో బాధపడుతున్నవారితో సహా, సాధారణ వ్యక్తులెవరూ వేసవికాలంలో ఏసీ గదిలో కూర్చుని ఒక్కసారిగా ఎండలోకి వెళ్లవద్దు.