Home » Heavy Rains
రానున్న రెండు వారాల్లో దేశవ్యాప్తంగా ఓ మోస్తరు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ఈ నెల 19 నాటికే దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ ఇటీవలే తెలిపింది.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. అయితే పర్యాటక ప్రాంతాలుగా ఉన్న జలాశయాల వద్ద అధికారులు సరైన భద్రతాచర్యలు తీసుకోకపోవడంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా తమిళనాడులో జలాశయానికి వరద పోటెత్తడంతో 16 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది.
భారీ వర్షానికి బంజారాహిల్స్ రోడ్నెంబర్-11(Banjara Hills Road No-11)లోని ఉదయ్నగర్ కాలనీలో నాలా రిటైనింగ్ వాల్ కూలింది. దీంతో పక్కనున్న రోడ్డు కుంగడంతో పాటు.. ఆ రహదారిపై పార్క్ చేసిన వాహనాలు, నాలాకున్న ఫెన్సింగ్.. వరద నీటిలో కొట్టుకుపోయాయి.
Andhrapradesh: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఇటు హైదరాబాద్, అటు బెజవాడలో ఉన్నట్టుండి వర్షం కురిసింది. భాగ్యనగరంలో గంట పాటు వర్షం పడగా.. అటు విజయవాడలో మాత్రం వర్ష బీభత్సం కొనసాగుతోంది. బెజవాడలో గత రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది.
భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీలోని ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) విభాగం ముందస్తు హెచ్చరికలు జారీచేసింది. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య భారీ వర్షం(Heavy rain) కురిసే అవకాశముందని, ఆ సమయంలో ప్రయాణాలు లేకుండా చూసుకోవాలని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి సూచించారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెట్లు, కొమ్మలు విద్యుత్తు తీగలపై విరిగిపడటంతో పలుచోట్ల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గురువారం మధ్యాహ్నం వరకు నగరంలో ఎర్రటి ఎండలే కాయగా.. 3 గంటల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై భారీ వర్షం పడింది. యూసుఫ్గూడలో 9 సెం.మీ., బంజారాహిల్స్ వెంకటేశ్వరకాలనీ 8.7 సెం.మీ, మలక్పేటలో 8.5, బేగంబజార్లో 8.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
ఐపీఎల్-2024లో భాగంగా.. గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఇది 66వ మ్యాచ్. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా..
హైదరాబాద్(Hyderabad Rains)లో కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం సెక్రటేరియట్లోని అన్ని విభాగాల అధికారులతో సీఎం మాట్లాడారు.
హైదరాబాద్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం కొన్ని గంటల పాటు భానుడి తాపంతో భగభగమంటూ మండిపోయి నగరం.. మధ్యాహ్నం నుంచి చల్లబడింది. మేఘాలు కమ్మేసి..