Home » High Court
ఐటీ పార్కుకు భూములు కేటాయించడం సబబేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేటాయింపులను సవాలు చేస్తూ ఫోరంఫర్ బెటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి ఓఎం డెబెరా, డాక్టర్ రావు వీబీజే చెలికానిలు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఇమరత్ కంచ గ్రామంలోని 4,067 ఎకరాలు, సరూర్నగర్ మండలం మామిడిపల్లిలోని 2,400 ఎకరాల అటవీ భూములను డీనోటిఫై చేయకుండా అటవీయేతర అవసరాలకు కేటాయించారని పిటిషనర్లు ఆరోపించారు.
సుప్రీంకోర్టులో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు (YS Sharmila) ఊరట లభించింది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడవద్దన్న కడప కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. షర్మిల వేసిన పిటీషన్పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
మాజీ మంత్రి హరీశ్రావుకు హైకోర్టులో నిరాశ ఎదురయింది. ఆనంద్ సినీ సర్వీసె్సకు జూబ్లీహిల్స్లో అయిదెకరాల భూమిని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఆయన 2008లో దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఆనంద్ సినీ సర్వీసె్సకు గోల్కొండ తాలూకా షేక్పేట్ గ్రామం సర్వే నెంబర్ 403లో ఎకరం రూ.8,500 చొప్పున అయిదెకరాల భూమిని కేటాయిస్తూ 2001లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 355 జారీచేసింది.
తన ఇంటి స్థలంపై వివాదం తలెత్తడంతో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని 681 చదరపు గజాల స్థలం విషయమై సమస్య తలెత్తింది. తాను ఆ స్థలాన్ని సుంకు గీత అనే మహిళ నుంచి 2003లో కొనుగోలు చేశానని, చట్టప్రకారం అన్ని అనుమతులు పొంది అదే ఏడాది ఇంటి నిర్మాణం చేపట్టానని జూనియర్ ఎన్టీఆర్ చెబుతున్నారు. కానీ ఆ భూమిని ఎన్టీఆర్కు అమ్మిన వ్యక్తులు దానిని 1996లోనే తమ వద్ద తనాఖా పెట్టి రుణాలు పొందారంటూ ఎస్బీఐ, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇండ్సఇండ్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు సర్ఫేసీ యాక్ట్ కింద డెట్ రకవరీ ట్రైబ్యునల్ (డీఆర్టీ)ను ఆశ్రయించాయి.
అద్దె బకాయిలు చెల్లించని నేపథ్యంలో ఆర్మూర్లోని జీవన్రెడ్డి మాల్ను ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం మాల్ వద్దకు చేరుకున్న అధికారులు భవనానికి నోటీసులు అతికించి.. తాళం వేశారు. ఒప్పందం ప్రకారం విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ బాధ్యులు అద్దె చెల్లించనందు వల్ల హైకోర్టు ఆదేశాల మేరకు జీవన్రెడ్డి మాల్ను స్వాధీనం చేసుకుంటున్నట్టు మైక్లో ప్రకటించారు. మాల్లో ఉన్న షాపుల యజమానులు సహకరించాలని కోరారు.
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులోని నిందితుల జాబితాలో ఆమ్ ఆద్మీ పార్టీని కూడా చేర్చుతామని ఈడీ మంగళవారం హైకోర్టుకు తెలిపింది.
లోక్సభ ఎన్నికల్లో "మతపరమైన విభజన ప్రసంగాలు'' చేయడం ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉల్లంఘించారని, ఆయనపై చర్యలకు ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు తోసిపుచ్చింది.
తెలుగు అకాడమీలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు హైకోర్టు భారీ ఊరట కలిగించింది. వారికి పెన్షన్ బకాయిలతో పాటు, జాప్యం జరిగినందుకు వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను రెండు వారాల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. పింఛను అనేది రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే దానమో, వరమో కాదని.. రాజ్యాంగబద్ధమైన హక్కు అని స్పష్టం చేసింది.
బాలీవుడ్ నటి కరీనాకపూర్ చిక్కుల్లో పడ్డారు. తన ప్రెగ్నసీకి చెందిన అనుభవాలతో రాసిన 'ప్రెగ్నన్సీ బైబిల్' అనే పుస్తకం ఈ చిక్కుల్ని తెచ్చిపెట్టింది. బుక్ టైటిల్లో 'బైబిల్' అనే పదం వాదటం తమ మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందంటూ న్యాయవాది క్రిస్టోఫర్ ఆంథోని పిటిషన్ వేశారు. దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా కరీనాకపూర్కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసు పంపింది.
బెంగాల్ ప్రభుత్వం బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల రద్దుపై కోల్కత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే ఈ కుంభకోణంపై విచారణ జరిపేందుకు సీబీఐకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.