Home » Hyderabad
వాహనాలను దొంగిలించటం చూస్తుంటాం.. అది రొటీన్ అనుకున్నాడేమో ఓ ఆకతాయి ఏకంగా ఎమ్మెల్యే కారు నంబర్ ప్లేట్నే కొట్టేశాడు. ఇంకేంటి ఆ నంబర్ ప్లేట్ను తన వాహనానికి తగిలించి చలాన్లు ఎగ్గొడుతూ కేటుగాడు దర్జాగా తిరుగుతున్నాడు. ఆర్టీఏ అధికారుల కళ్లు గప్పి ఎన్ని రోజులు ఉంటాడు..? అడ్డంగా బుక్ అయ్యాడు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul)పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు అయింది. తెలంగాణ - 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని కేఏ పాల్ చెప్పారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదుచేశారు.
హైదరాబాద్ - విజయవాడ హైవేపై(Hyderabad - Vijayawada High Way) నిత్యం వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. ఆ స్థాయిలోనే ప్రమాదాలూ జరుగుతుండటం అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. హైదరాబాద్ - విజయవాడ హైవే(NH-65)పై నిత్యం ప్రమాదాలు జరుగుతున్న 17 బ్లాక్ స్పాట్స్ని అధికారులు గుర్తించారు.
ఇటివల కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నకిలీ ఎంబీబీఎస్(MBBS) డిగ్రీ ఆధారంగా పలువురు క్లినిక్ ఏర్పాటు చేసి వైద్యం చేస్తున్న ఉందంతాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్(hyderabad) బోరబండ(borabanda) పరిధిలో ఇద్దరు ఫేక్ డాక్టర్ల గుట్టును అధికారులు ఛేధించారు.
Telangana: కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ బోగస్ ప్రభుత్వంగా మారిపోయిందని విమర్శలు గుప్పించారు. వడ్లు కొనుగోలులో సీఎం రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు. ఎప్పుడు పడిపోతుందో..
ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది.
Telangana: రాములమ్మ అంటే తెలియని వారు ఉండరు. బీజేపీలో అసంతృప్తితో ఉన్న విజయశాంతి గతేడాదే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్లో రాములమ్మకు కీలక పదవి కూడా లభించింది. పార్టీలో చేరిన 24 గంటల్లోనే క్యాంపెయిన్ అండ్ ప్లానింగ్ కమిటీకి చీఫ్ కో-ఆర్డినేటర్ పదవిని కాంగ్రెస్ కట్టబెట్టింది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్లో ఉంటూనే బీఆర్ఎస్ పార్టీ గురించి విజయశాంతి మాట్లాడటం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
Telangana: వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేస్తున్నా ఫలితాలు రావడం లేదన్నారు. గన్నీ బ్యాగుల విషయంలో కావాలని కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వర్షాలతో కల్లాల్లో ధాన్యం కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
డబ్బు కోసం ఏకంగా భర్త, అత్తపైనే దాడి చేయించిందో మహిళ. అత్తను చంపేస్తే ఇన్స్యూరెన్స్ డబ్బులు వస్తాయని భావించింది. మానవత్వం మరచి.. తన తరుఫు బంధువులను అరేంజ్ చేసి మరీ కొట్టించిన ఘటన స్థానికంగా పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది. బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కట్టేల మండి సమీపంలో భర్త, అత్తపై బంధువులతో భార్య దాడి చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Telangana: ఇక్ఫాయి ఘటనపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. లా విద్యార్థిని లేఖ్య వర్ధిని ఒంటిపై గాయాలపై ఇప్పటికీ స్పష్టత రాని పరిస్థితి. వాష్ రూమ్లో ఏం జరిగింది అనేది ఇప్పటికీ సస్పెన్సే. అసలు ఘటన ఎలా జరిగిందనే దానిపై యూనివర్సిటీ అధికాలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. వేడినీళ్ళ కారణంగానే ఘటన జరిగిందని క్లారిటీ ఇవ్వలేము అంటూనే యాసిడ్ ఎటాక్ను యూనివర్సిటీ అధికారులు తోసిపుచ్చారు.