Home » IPL 2024
ఐపీఎల్-2024లో (IPL 2024) తమ చివరి లీగ్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు చెలరేగారు. ముంబై వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. లక్నో స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ మరోసారి చెలరేగాడు.
భాగ్యనగరం హైదరాబాద్లో భారీ వర్షం కారణంగా సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య రాత్రి 10 గంటల సమయానికి కూడా ప్రారంభం కాలేదు. ఇంకా వర్షం పడుతూనే ఉండడంతో ఇప్పటిదాకా కనీసం టాస్ కూడా పడలేదు. ఉప్పల్ స్టేడియంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇంకా వర్షం పడుతూనే ఉంది.
ఐపీఎల్-2024లో భాగంగా.. గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఇది 66వ మ్యాచ్. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా..
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తాజాగా తన రిటైర్మెంట్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక్కసారి తాను వీడ్కోలు పలికితే.. చాన్నాళ్ల పాటు తాను ఎవరికీ కనిపించనని కుండబద్దలు..
రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసినప్పటి నుంచి ముంబై ఇండియన్స్ టీమ్ అనవసర వివాదాలను ఎదుర్కొంటూనే ఉంది. హార్దిక్ను కెప్టెన్ చేయడాన్ని చాలా మంది ముంబై ఫ్యాన్స్ వ్యతిరేకించారు. అన్ని విమర్శల నడుమ ముంబై టీమ్ నాయకత్వం చేపట్టిన హార్దిక్ ఘోరంగా విఫలమయ్యాడు.
గురువారం జరిగే క్రికెట్ మ్యాచ్కు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) పరిసర ప్రాంతాలకు 60 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ అధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు.
ఐపీఎల్లో ఆరో మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఉప్పల్(Uppal)లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ముస్తాబైంది. గురువారం సాయంత్రం 7.30 గంటలకు గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తలపడనుంది.
ఐపీఎల్-2024 సీజన్లో టేబుల్ టాపర్గా నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు చతికిలపడ్డారు. గువహటి వేదికగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ బ్యాటర్లు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగారు.
క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని)Cricketer Mahendra Singh Dhoni)కి దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ ఆయన క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం ఐపీఎల్(IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సోమవారం రాత్రి కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దవడంతో ‘ప్లే ఆఫ్స్’ సమీకరణాలు మారాయి. మ్యాచ్ రద్దవడంతో చెరొక పాయింట్ లభించడంతో ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ టైటాన్స్ నిష్క్రమించింది.