Home » KADAPA
సుప్రీంకోర్టులో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు (YS Sharmila) ఊరట లభించింది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడవద్దన్న కడప కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. షర్మిల వేసిన పిటీషన్పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
కడప జిల్లా ముద్దనూరులో సిమెంటు లోడు లారీ భీభత్సం.. వేగంగా దూసుకెళ్లి రైల్వే గేట్లను ఢీకొని సెంటర్లో ఉన్న బట్టల షాపులోకి లారీ దూసుకెళ్లి్ంది. బట్టల షాపు రెండు నివాస గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ బట్టల షాపు, ఇల్లు ముద్దనూరులో విలేకరిగా పని చేస్తున్న చలపతిగా గుర్తించారు.
సుప్రీంకోర్టులో వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. వైయస్ వివేకా హాత్య కేసు అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించ కూడదంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. అలాగే వైయస్ షర్మిలతో పాటు ఇతరులపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులపైనా కూడా సుప్రీంకోర్టు స్టే విధించింది.
ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఎన్నికలు (ap elections 2024) పోటీపోటీగా జరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో కీలక నేతల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతుంది. ఈ క్రమంలో కీలక ప్రాంతమైన కడప పార్లమెంట్ నియోజకవర్గం(kadapa Lok Sabha constituency) స్థానం కోసం ఎంత మంది పోటీ చేస్తున్నారనే విషయాలు ఇక్కడ చుద్దాం.
కడప: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు, ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల శనివారం కడపలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కంటతడి పెట్టుకున్నారు. శుక్రవారం కడపలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. తాను అడిగి ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ తన సోదరుడు, సీఎం వైయస్ జగన్ను ఆమె డిమాండ్ చేశారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డికి ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి మరోసారి లేఖ రాశారు. నవ సందేహాలు పేరులో షర్మిల ఇప్పటికే రెండు సార్లు సీఎంకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశారంటూ మొదటి సారి, మద్యం నిషేధంపై రెండో సారి లేఖ రాసిన షర్మిల..
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్, కడప పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలపై(YS Sharmila) కేసు నమోదు చేశారు పోలీసులు. బద్వేల్ పోలీస్ స్టేషన్లో(Badvel Police Station) ఆమెపై కేసు నమోదైంది. మే 2వ తేదీన బద్వేల్ బహిరంగ సభలో వైఎస్ వివేకా(YS Viveka) హత్య కేసు గురించి..
Andhrapradesh: ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనుచరుడిపై ఫాక్సో, అత్యాచార కేసు నమోదు అయ్యింది. వన్ టౌన్ పోలీస్స్టేషన్లో వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే అనుచరుడు వడ్ల దాదాపీర్పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపీర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) సొంత జిల్లాలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) మండిపడ్డారు. ఏపీ నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ మొదలవుతోందని అన్నారు. ఏపీ ప్రగతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత్ర కీలక పాత్ర పోషించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పీవీ నరసింహరావుకి సైతం భారతరత్న ఇచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానికి చెందుతుందని అన్నారు.