Home » KCR
తెలంగాణలో కేసీఆర్ను ఓడించినట్లే, ఏపీలో జగన్ను అక్కడి ప్రజలు ఓడించడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ను అహంకారం ఓడించిందని.. ఇప్పుడు జగన్ విషయంలోనూ అదే జరగబోతోందని అన్నారు. జగన్ ఇచ్చిన ఉచితాలకు ఆయన ఇంట్లో కూర్చుని గెలవాలని.. కానీ అక్కడ అంత సీన్ లేదని పేర్కొన్నారు. అభివృద్ధిపై దృష్టి పెడితే మరోలా ఉండేదని అన్నారు.
రాజకీయాల్లో విజయం, అధికారం ఎప్పుడూ ఏ ఒక్కరి సొత్తూ కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజాతీర్పుకు కట్టుబడి సుపరిపాలన అందించాలని సూచించారు. ప్రతిపక్షం ఉంటేనే ప్రజలకు సుపరిపాలన అందుతుందన్నారు.
రాష్ట్ర ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ సర్కారు ఐదు నెలల్లోనే కుప్ప కూల్చడం బాధాకరమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం ‘డయాగ్నస్టిక్ హబ్లకు జబ్బు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. ‘లక్షలాది మంది పేదలకు ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన వైద్య పరీక్షలను అందించిన డయాగ్నస్టిక్ కేంద్రాలు ఇప్పుడు నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రధాన సాంస్కృతిక, భక్తి కేంద్రాల్లో రచయిత పురాణపండ శ్రీనివాస్ అమోఘ రచనా సంకలనం ‘ఉగ్రం... వీరం’ పవిత్ర గ్రంధాన్ని ఏడుగురు ప్రముఖులచే... ఏడురోజులపాటు ఈ ఒక్క గ్రంధాన్నే ఆవిష్కరింపచేసి భక్తకోటికి, రసజ్ఞ ప్రపంచానికి, సాహితీ ప్రియులకు, బీఆర్ఎస్ శ్రేణులకు ఇవ్వడానికి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ ఐటి శాఖా మంత్రి పొన్నాల లక్ష్మయ్య పూనుకున్న దృఢ సంకల్పంలో భాగంగా మొదటగా సోమవారం సాయంకాలం ప్రఖ్యాత కళావేదిక త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో ‘ఉగ్రం... వీరం’ ఆవిష్కరణోత్సవానికి తెరలేచింది. ఈ సభలో కె.సి.ఆర్, పొన్నాల, పురాణపండలపై ప్రశంసలు వర్షించాయి.
Telangana: ఈనెల 27న ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని... బీజేపీ అభ్యర్థిగా 40 ఏళ్లుగా సిద్ధాంతాన్ని నమ్ముకుని ఎత్తిన జెండా దింపని గుజ్జుల ప్రేమెందర్ రెడ్డిని ఎమ్మెల్సీ బరిలో నిలిపామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ఆనాడే ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించినా నేటికీ అమలు చేయకపోవడం పట్ల వారు బాధతో ఉన్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు చెల్లింపు విధానంతో మళ్ళీ ఆర్టీసీని దివాలా తీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇల్లందు పట్టభద్రుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందన్నారు. మార్పు కావాలని ఓటేసిన పాపానికి కాంగ్రెస్ వైఖరి జనాలకు అర్థమైందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా నిరుద్యోగులు, యువత దూరమయ్యారన్నారు.
Telangana: రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలలోనే కుప్పకూల్చడం బాధాకరమని మాజీ మంత్రి హరీష్రావు వ్యాఖ్యలు చేశారు. డయాగ్నస్టిక్ కేంద్రాల్లో వైద్యులు, సిబ్బందికి పెండింగ్ జీతాల చెల్లింపుపై హరీష్రావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..
రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా వాటిని సరిగా ప్రచారం చేసుకోలేకనే ఎన్నికల్లో ఓడిపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్గా నిలిచిందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు, వ్యవసాయ పురోభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్ చేసిన కృషిని వివరిస్తూ.. ఆపార్టీ నేత గోసుల శ్రీనివా్సయాదవ్ భూమిపుత్రుడు పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని ఎర్రవెల్లిలోని ఫామ్హౌ్సలో కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హరీశ్రావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) విషయంలో యుటిలిటీ చార్జీలను చెల్లించబోమని గత బీఆర్ఎస్ సర్కారు కేంద్రానికి లేఖ రాయడంతో మొత్తం ప్రాజెక్టే ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక యుటిలిటీ చార్జీల కింద రూ.363.43 కోట్లను చెల్లిస్తామని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్రెడ్డి, తాను కలిసి లేఖ రాశామని వెల్లడించారు.