Home » Latest News
హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. హర్యానాలో గల నుహ్ వద్ద కుంద్లీ మనేసర్ పల్వాల్ ఎక్స్ప్రెస్ వే పై ఓ బస్సుకు మంటలు అంటుకున్నాయి. ప్రమాదం సమయంలో బస్సులో 64 మంది ఉన్నారు. వారంతా బృందావనంలో శ్రీకృష్ణుడిని దర్శించుకొని తిరిగి వస్తున్నారు.
ఎండాకాలంతో జూరాల ప్రాజెక్ట్లో నీరు లేకపోవడంతో అక్కడి ప్రజలు సాగు, తాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) విజ్ఞప్తితో కర్ణాటక ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. నారాయణపూర్ డ్యాం నుంచి నీటిని విడుదల చేయడానికి కర్ణాటక ప్రభుత్వం ముందుకు వచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తునకు కమిటీ ఏర్పాటైంది. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 13 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది.
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్పై హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ కేసులో ఇద్దరు నిందితులని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బూటకపు ఎన్కౌంటర్లను హెచ్చరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోలు శుక్రవారం లేఖ రాశారు. అల్లూరి డివిజన్ కమిటీ పేరుతో మావోయిస్ట్ పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. భారత విప్లవోద్యమం నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న విప్లవ ప్రతిఘాతుక దాడిని ఓడిద్దామని పిలుపునిచ్చారు. మావోయిస్టుల పేరుతో ఆదివాసీలను దొరక బట్టి చంపుతున్నారని.. బూటకపు ఎన్కౌంటర్లను నిజమైన ఎన్కౌంటర్లగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలైంది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు (AP Elections 2024) జరుగుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య గట్టి పోటీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పలువురు దేశ, విదేశాల నుంచి ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఓ ఎన్ఆర్ఐ అమెరికా నుంచి వచ్చి ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి మాత్రమే వచ్చారు.
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 10 నెలల క్రితం ఓ డ్రైవర్ అదృశ్యమవగా.. అతను కనిపించకుండా పోవడానికి గల కారణం ఇప్పుడుు తేలింది. ఇంతకాలం పోలీసులు ఎంత వెతికినా కనిపెట్టలేకపోయారు. కానీ.. ఒక మొబైల్ ఫోన్ అసలు రహస్యాన్ని బట్టబయలు చేసింది. 10 నెలల కాలంగా ఆఫ్లో ఉన్న ఫోన్.. ఇప్పుడు ఆన్ కావడంతో..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడైన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
శ్రీకాళహస్తిలో ఈసారి సీన్ రివర్సవుతోంది. ఒకసారి ఓటమి సానుభూతి.. వైసీపీ వేవ్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన మధుసూదన్రెడ్డికి ప్రస్తుతం ఎదురుగాలి వీస్తోంది. విపరీతమైన అవినీతి ఆరోపణలున్నాయి. నిత్య వివాదాస్పద నేతగా ముద్ర వేసుకున్నారు.
దిగ్గజ కంపెనీ గూగుల్ సరికొత్త ఫీచర్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై గూగుల్లో ఏదైనా ఈజీగా సర్చ్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లలో సెర్చ్ చెయ్యడానికి సర్కిల్ టు సెర్చ్ (Circle to search) అనే కొత్త ఫీచర్ను ప్రారంభించింది.