Home » Lok Sabha Election 2024
రాయబరేలి ప్రజలకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీలక అభ్యర్థన చేశారు. నియోజకవర్గం ప్రజలు తనను ఆదరించినట్టే తన కుమారుడు రాహుల్ గాంధీ ని కూడా అక్కున చేర్చుకోవాలని కోరారు. ప్రజల ఆశలను రాహుల్ ఏమాత్రం వమ్ము చేయరని అన్నారు.
రాష్ట్రంలో పోలింగ్ తర్వాత జరిగిన ఘటనలపై ఎన్నికల కమిషన్ (Election Commission) ఆదేశాలు వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ (Kanakamedala Ravindra Kumar) కోరారు.
నెల్లూరు లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి బరిలో నిలిచారు. ఎన్నికల పోలింగ్ అయిపోయాయి. అయితే విజయసాయిరెడ్డి ఎక్కడా కనిపించక పోవడం పట్ల ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతుంది.
ఈ ఎన్నికల్లో వైసీపీ (YSRCP) తప్పకుండా అధికారంలోకి వస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెల 9న జగన్ సీఎంగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. వేదిక ఎక్కడో రెండు రోజుల్లో చెబుతానని అన్నారు. కేంద్రంలో తమ మీద ఆధారపడే ప్రభుత్వం రావాలని కోరుకుంటానని... ఇది తన స్వార్థమని తెలిపారు.
తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ను బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు (Raghunandan Rao) శుక్రవారం కలిశారు. లోక్సభ ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని డిస్క్వాలిఫై చేయాలని సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికల్లో ఒక్కో ఓటర్కు ఆయన రూ. 500లు పంపిణీ చేశారని ఆరోపించారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లో శుక్రవారం వరుస ప్రచారసభల్లో పాల్గొంటున్నారు. తన ప్రసంగాల్లో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ కూటమిపై పంచ్లు గుప్పిస్తున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఆ ఇద్దరూ విదేశాలకు వెళ్లేందుకు టిక్కెట్లు బుక్ చేసుకుట్టు తనకు తెలిసిందని ఫతేపూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఈడీ శుక్రవారం ఛార్జీషీట్ దాఖలు చేసింది.
పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీకి(Mamata Banerjee) వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను తమ్లూక్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయ్కి(Abhijit Gangopadhyay) ఎన్నికల సంఘం(EC) శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీచేసింది.
ఏపీలో ఐదేళ్లలో వైసీపీ (YSRCP) నేతలు పెట్రేగిపోయారు. వారు సృష్టించిన అరాచకం, దాడులు అన్ని ఇన్ని కావు. సామాన్యులపై దాడులు చేస్తూ ఈ ఐదేళ్లలో ఎన్నో రకాలుగా భయభ్రాంతులకు గురిచేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అమేథీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అమేథీ నుంచే తాను రాజకీయాలు నేర్చుకున్నానని, తాను వారితోనే ఉన్నానని, ఉంటానని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని అమేథీలో కాంగ్రెస్, ఇండియా కూటమి అభ్యర్థి కేఎల్ శర్మ తరఫున శుక్రవారంనాడు ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.