Home » Lok Sabha Election 2024 Live Updates
ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోగా ఓటింగ్కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పెట్టాలంటూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది.
సుప్రీంకోర్టులో వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. వైయస్ వివేకా హాత్య కేసు అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించ కూడదంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. అలాగే వైయస్ షర్మిలతో పాటు ఇతరులపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులపైనా కూడా సుప్రీంకోర్టు స్టే విధించింది.
లోక్సభకు ఆరో దశలో జరగనున్న ఎన్నికల్లో 92 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. ఈ దశ ఎన్నికల బరిలో ఉన్న 869 మంది అభ్యర్థుల్లో 866 మంది అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) విశ్లేషించింది.
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గంగా సప్తమి పర్వదినాన.. ప్రధాని మోదీ వారాణసీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. అమిత్షా, రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ సహా పలువురు ఎన్డీయే కూటమి నేతలు తదితర అతిరథమహారథులు వెంటరాగా..
Lok Sabha Election 2024 Live Updates in Telugu: దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల 4వ విడత పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే బారులు తీరారు. నాలుగో విడతలో భాగంగా నేడు నాడు దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 96 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాలతో పాటు.. 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఏకకాలంలో పోలింగ్ జరగనుంది.
పోలింగ్ రోజు కూడా వైసీపీ అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. పల్నాడు జిల్లా టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్బాబును(Chadalavada Arvind Babu) వైసీపీ మూకలు టార్గెట్ చేశారు.
తెలంగాణలో సమస్యాత్మక ప్రాంతాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే ఇప్పటికే క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటు వేయడానికి ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు.
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు(Lok Sabha Polls 2024), పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే పోలింగ్ ముగిశాక ఈవీఎం మిషన్లను ఏం చేస్తారనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా. ఈవీఎంల(EVMs) భద్రత ఎలా ఉంటుంది, రీకౌంటింగ్కు పట్టుబడితే పరిస్థితి ఏంటి తదితర వివరాలు తెలుసుకుందాం.
రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా అందోల్ - జోగిపేట పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా(Damodar Rajanarsimha) కుమార్తె త్రిషతో కలిసి 196వ పోలింగ్ బూత్లో ఓటు వేశారు.
సిద్దిపేట జిల్లా చింతమడకలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) ఆయన సతీమణి శోభతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన వెంట మాజీ మంత్రి హరీశ్రావుతో పాటు బీఆర్ఎస్(BRS) నేతలు ఉన్నారు.