Home » Machilipatnam
కృష్ణాజిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెడుతూ.. గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కృష్ణాజిల్లా, మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మహిళా పోలీసులను విధుల్లో నియమించారు.
తన వారసుడిగా కొడుకు పేర్ని కిట్టును రంగంలోకి దించేందుకు సీనియర్లను పేర్ని పక్కనపెట్టారు. కిట్టును ఎలాగైనా గెలిపించుకోవాలని నానా తంటాలు పడుతున్నారు. ఇందుకు ..
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల్లో బేలతనం కనిపించింది. ‘వీరభక్త ఐపీఎ్స’ల సహాయంతో ఎలాగైనా ఎన్నికల్లో గెలుద్దామనుకున్న తన వ్యూహాలు బెడిసికొడుతుండటంతో ఏకంగా ఎన్నికల కమిషన్పైనే ఆయన ఆక్రోశం వ్యక్తంచేశారు..
Andhrapradesh: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. అయితే ఎన్నికల ప్రచారాల్లో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికార, ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులు ఒకేసారి, ఒకే చోట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థుల అనుచరులు, కార్యకర్తలు..
రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని హంగు ఆర్భాటాలు చేసే నేతలను అ నేక మందిని చూశాం. కానీ పార్టీ అధికారం కోల్పోయి క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు అధికార పార్టీ పెట్టే ఒత్తిళ్లను అధిగమించి, అక్రమ కేసులకు వెరువక పార్టీ కోసం, ప్రజల కోసం, పనిచేసే నేతలు అరుదు. ఆ కోవకు చెందిన వారే మచిలీపట్నం(Machilipatnam) పార్లమెంటు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు..
ఆయన.. ఆంధ్రప్రదేశ్లోనే (Andhra Pradesh) కాదు. దేశంలోనే పేరున్న కేన్సర్ వైద్యుల్లో ఒకరు. ఆయన తండ్రి దేవుడి మంత్రిగా పేరొందిన వ్యక్తి. ఆయన ఇమేజ్ను సొమ్ము చేసుకునేందుకు వైసీపీ (YSR Congress) పెద్దలు స్కెచ్ వేశారు. ముగ్గులోకి దింపారు. తొలుత అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కేటాయించారు. వైసీపీ పెద్దల మాటలు నమ్మి...
విజయవాడ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవణ్ కల్యాణ్ బుధవారం కృష్ణా జిల్లాలో ఉమ్మడి ప్రచారం చేయనున్నారు.
Andhrapradesh: బందరు తాలుకా పోలీస్ స్టేషన్ పై దుమ్మీకి వెళ్లిన పేర్ని నాని, అతని కుమారుడు కిట్టుపై కేసు నమోదు చేయాలని మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. బందరు మండలం ఆర్ గొల్లపాలెంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వందలాది వైసీపీ శ్రేణులతో తాలుకా పీఎస్ వద్ద అలజడి సృష్టించిన తండ్రీ, కొడుకులపై కేసు నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhrapradesh: జిల్లాలోని బందరు తాలుకా పోలీస్స్టేషన్ ముందు వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని, ఆయన అనుచురులు చేసిన హాంగామాపై పోలీసులు చర్యలకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే పేర్నినాని, అతని అనుచురులపై చిలకలపూడి పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఐపీపీ 188, 143, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిన్న(మంగళవారం) వైసీపీ శ్రేణులతో కలిసి బందరు తాలుకా ఎస్ఐ చాణిక్యపై పేర్నినాని దౌర్జన్యానికి దిగారు.
జనసేన మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్ధి వల్లభనేని బాలశౌరి ఇవాళ మచిలీపట్నం పర్యటన నేపథ్యంలో ఆయనకు వైసీపీ నేతల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. పైగా బాలశౌరి మీటింగ్కు ఎవరెవరు వెళ్తున్నారో నోట్ చేసుకోవాలని రాజీనామా చేసిన వలంటీర్లకు వైసీపీ నేతలు ఆదేశాలు జారీ చేశారని సమచారం.