Home » Mulugu
ములుగు జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జోరుమీదున్న కాంగ్రెస్, సార్వత్రిక ఎన్నికల్లోనూ సత్తా చాటాలని గట్టిగా కృషిచేస్తోంది. ఈ క్రమంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి సీతక్క ములుగు జిల్లా, వెంకటాపురం మండలం, నల్లగుంటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ములుగు జిల్లాలో మావోయిస్ట్ లేఖ కలకలం సృష్టించింది. తెలంగాణ - ఛత్తీస్ఘడ్ సరిహద్దు కాంకేర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ను మావోయిస్ట్ పార్టీ ఖండించింది. పూజార్ - కాంకేర్ ఎన్కౌంటర్ మృతులకు మావోయిస్ట్ పార్టీ జోహార్లు అర్పించింది.
Telangana: తెలంగాణ కుంభమేళాగా పిలవడే మేడారం సమక్క-సారలమ్మ మహా జాతర అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాది మంది భక్తులు మేడారంకు విచ్చేసి గద్దెలపై కొలువుదీరిన అమ్మవార్లను దర్శించుకుని... మొక్కలు చెల్లించుకున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరిగింది. అయితే జాతర ముగిసిన తర్వాత మాత్రం అక్కడి పరిసరాలను చూస్తే ముక్కులు మూసుకోకమానరు.
వరంగల్: మేడారం హుండీల లెక్కింపు ప్రక్రియ గురువారం హనుమకొండ టీటీడీ కళ్యాణమండపంలో ప్రారంభం కానుంది. మొత్తం 512 హుండీల ఆదాయాన్ని లెక్కించనున్నారు. ఈ లెక్కింపు ప్రక్రియ పది రోజుల పాటు కొనసాగనుంది.
ములుగు జిల్లా: సమ్మక్క-సారలమ్మ పూజారులు బుధవారం తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. దీంతో మహాజాతర ఘట్టం పూర్తిగా ముగిసినట్లు పూజారులు ప్రకటిస్తారు. ఆదివాసి పూజారులు పూజా మందిరాలను శుద్దిచేసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పూజా మందిరాలకు తాళాలు వేస్తారు.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర నాలుగు రోజుల పాటు కన్నుల పండువగా సాగి అత్యంత వైభవంగా ముగిసింది. జాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క వన ప్రవేశంతో జాతర పరిసమాప్తమైంది.
Telangana: మేడారం సమక్క - సారమ్మ మహా జాతర వైభవంగా జరుగుతోంది. ఇప్పటికే పెద్దసంఖ్యలో భక్తులు మేడారంకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శుక్రవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, కేంద్ర మంత్రి అర్జున్ ముండా మేడారం చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్, కేంద్రమంత్రి నిలువెత్తు బంగారం సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.
సమ్మక్క-సారలమ్మల నామస్మరణతో మేడారం మహా జాతర (Medaram Maha Jatara) వైభవంగా జరుగుతోంది. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, ఎత్తు బంగారాలను భక్తులు సమర్పిస్తున్నారు. అయితే జాతరలో రెండో రోజు జాతరలో అత్యంత కీలక ఘట్టం ప్రారంభమైంది. వనం వీడి జనం మధ్యలోకి సమ్మక్క బయలుదేరింది. ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో పూజారుల బృందం చిలుకల గుట్ట సమీపంలోకి చేరుకుంది.
Telangana: మేడారం సమక్క - సారలమ్మ మహా జాతర కీలక ఘట్టానికి చేరిందని మంత్రి సీతక్క తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కోయ పూజారులు ఉపవాసం ఉండి పూజా కార్యక్రమాలు చేస్తారని తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి చిలకలగుట్టలో పూజలు ప్రారంభమవుతాయన్నారు.
Telangana: మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైంది. మేడారంలో సమ్మక్క ఆగమన పూజలు ప్రారంభమయ్యాయి. గద్దెపై కంకవణాన్ని కోయపూజారులు ప్రతిష్టించారు.