Home » Narendra Modi
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. మొత్తం ఏడు దశల పోలింగ్లో భాగంగా ఐదు దశల ఎన్నికలు ముగిశాయి. అన్ని పార్టీలు యూపీలో ఎక్కువ స్థానాలు గెలవడంపైనే దృష్టిసారించాయి. 80 లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేదశ్లో ఇప్పటివరకు 53 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా.. మరో రెండు దశలో 27 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
దేశంలోని అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఎక్కువ సీట్లు గెలిస్తే కేంద్రంలో అధికారంలోకి రావచ్చనేది అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అంచనా. 2014, 2019 ఎన్నికల్లో యూపీలో మెజార్టీ సీట్లు గెలుచుకోవడం ద్వారా ఎన్డీయే కూటమి రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది.
విపక్ష పార్టీల సారథ్యంలోని 'ఇండియా' కూటమిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. 21వ శతాబ్దపు భారతదేశాన్ని 'ఇండి' కూటమి పాపాలు ముందుకు తీసుకువెళ్లలేవని అన్నారు.
ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని పని చేయడమే తనకు తెలుసని.. ప్రజాసేవకే తన జీవితం అంకితమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. పదవుల కోసం, గుర్తింపు కోసం ఆలోచించనని.. తాను కార్యసాధకుడిని మాత్రమేనని అన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
అవినీతిపై ఒడిశాలోని బిజూ జదనతాదళ్ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తప్పుపట్టారు. రాష్ట్రానికి ప్రభుత్వం కేవలం ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా, మైనింగ్ మాఫియాలను ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో తొలిసారి బీజేపీ ముఖ్యమంత్రిని ఎన్నుకోనుండటం ద్వారా ప్రజలు కొత్త చరిత్రను సృష్టించబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడమే ఉపాధ్యాయుల ప్రధాన ధర్మం. అయితే.. ఒక్కోసారి టీచర్లు తమ విధులకు భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. ఆ ప్రవర్తన వారికి లేనిపోని సమస్యలు తీసుకొస్తుంటాయి.
లోక్సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్కు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన హామీ ఇచ్చారు. ఇకపై అవినీతిపరులను బయట ఉండనివ్వనని, ఈ మేరకు దేశ ప్రజలకు మరో గ్యారంటీ ఇస్తున్నానని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్లోని పురులియా బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ సంచలన ప్రకటన చేశారు. మరో ఆరు నెలల్లోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) భారత్లో విలీనం అవుతుందని పేర్కొన్నారు. అయితే.. నరేంద్ర మోదీ..
కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండాల్సిన అవసరాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే శత్రువు మనపై ఏది చేయాలన్నా ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాడని అన్నారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటర్లను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. విపక్ష 'ఇండియా'కి ఓటు వేసి గెలిపిస్తే రామాలయంపై బుల్డోజర్ నడిపిస్తుందంటూ పదేపదే ప్రధాని చేస్తున్న వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.