Home » National
పుణేలో ఓ మైనర్ కారు ప్రమాదంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడిని అరెస్ట్ చేసిన తర్వాత స్టేషన్ తీసుకెళ్లి రాచ మర్యాదలు అందజేశారని తెలిసింది. మద్యం సేవించి, డ్రగ్స్ కూడా తీసుకున్న యువకుడికి స్టేషన్లో వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణంపాలయ్యారు. ఆదివారం ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ భారీ వర్షాలు, దట్టమైన పొగమంచు, ఈదురుగాలులతో తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్లోని పర్వతాల మధ్య ఉన్న డిజ్మార్ అటవీ ప్రాంతంలో కూలిపోయిన విషయం తెలిసిందే.
పుణేలో ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటలకు పోర్సే కారు వేగంగా వచ్చింది. తన ముందు ఉన్న బైక్ను వేగంగా ఢీ కొట్టింది. కారు ఢీ కొనడంతో బైక్పై ఉన్న ఇద్దరు ఎగిరి పడ్డారు. స్పాట్లోనే చనిపోయారు. ఆ సమయంలో అక్కడున్న స్థానికులు కారు నడిపిన వ్యక్తిని బయటకు తీశారు. దేహశుద్ది చేసి, పోలీసులకు అప్పగించారు. చిన్న వయస్సు ఉంది. ఆ యువకుడికి 17 ఏళ్లు అని తేలింది. క్లబ్లో పార్టీ చేసుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది.
పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోన్న ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతదేహానికి సమీపంలో రక్తపు మరకలు కనిపించాయి. ఆ విద్యార్థి చీర కట్టుకొని, మేకప్ వేసుకొని, చేతులకు గాజులు వేసుకొని కనిపించాడు. కళ్లకు గంతలు కూడా కట్టుకొని ఉన్నాడు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
వారు అమ్మేది చెప్పులు.. కానీ, వారి వద్ద ఉన్న సంపద కోట్లు.. అవును, వారి వద్ద ఉన్న నోట్ల కట్టలు చూసి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఖంగుతిన్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ. 40 కోట్ల నగదు పట్టుబడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది.
ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన వెంటనే విమానం ఇంజిన్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఫైలట్ వెంటనే విమానాన్ని ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను కిందకి దింపారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి కేసులో ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారు. తనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని స్వాతి మాలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. బెయిల్ మీద బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికెళ్లానని స్వాతి మాలివాల్ వివరించారు. ఆ సమయంలో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
కర్ణాటక రాజకీయాలను ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు ఓ కుదుపు కుదిపేశాయి. వీడియోలు బయటకు వచ్చేందుకు కారణం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అని బీజేపీ నేత జి దేవరాజే గౌడ సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలో కుమారస్వామిని రాజకీయంగా ఫినిష్ చేయాలనేది శివకుమార్ టార్గెట్ అని బాంబ్ పేల్చారు. అందుకోసం తనను సంప్రదించారని వివరించారు.
హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. హర్యానాలో గల నుహ్ వద్ద కుంద్లీ మనేసర్ పల్వాల్ ఎక్స్ప్రెస్ వే పై ఓ బస్సుకు మంటలు అంటుకున్నాయి. ప్రమాదం సమయంలో బస్సులో 64 మంది ఉన్నారు. వారంతా బృందావనంలో శ్రీకృష్ణుడిని దర్శించుకొని తిరిగి వస్తున్నారు.