Home » National News
'ఆమ్ ఆద్మీ పార్టీ' చుట్టూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) వల బిగుసుకుంటోంది. 2014-2022 మధ్య రూ.7.08 కోట్ల విదేశీ నిధులను 'ఆప్' అందుకుందంటూ హోం మంత్రిత్వ శాఖకు ఈడీ రిపోర్డ్ చేసింది.
ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోమవారంనాడు జరిగిన లోక్సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ ముగిసింది. మొత్తంగా 56.7 శాతం పోలింగ్ నమోదైంది. ఈసీ వివరాల ప్రకారం, పశ్చిమబెంగాల్లో గరిష్టంగా 73 శాతం పోలింగ్ నమోదైంది.
మహారాష్ట్రలోని పూణె(pune)లో ఓ 17 ఏళ్ల మైనర్ బాలుడు ఖరీదైన పోర్షే కారు(Porsche luxury car)తో మోటార్సైకిల్ను ఢీకొట్టాడు. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఆ క్రమంలో కోర్టు అతడిని పెద్దవారిలా విచారించి పోలీసు కస్టడీకి పంపేందుకు పోలీసులు అనుమతి కోరగా, కోర్టు అందుకు నిరాకరించి నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ షరతులు ఏంటనేది ఇప్పుడు చుద్దాం.
గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్ కీలక అరెస్టులు చేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాతో సంబంధాలున్నట్టు అనుమానిస్తున్న నలుగురు ఉగ్రవాదులను అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రంలో సోమవారంనాడు అరెస్టు చేసింది
ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఐదో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతానికి 47.53 శాతం పోలింగ్ నమోదైంది.
ఛత్తీస్గఢ్ లోని కవార్థా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న పికప్ వాహనం బోల్తాపడి 18 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
అవినీతిపై ఒడిశాలోని బిజూ జదనతాదళ్ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తప్పుపట్టారు. రాష్ట్రానికి ప్రభుత్వం కేవలం ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా, మైనింగ్ మాఫియాలను ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో తొలిసారి బీజేపీ ముఖ్యమంత్రిని ఎన్నుకోనుండటం ద్వారా ప్రజలు కొత్త చరిత్రను సృష్టించబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు.
దేశీయ స్టాక్ మార్కెట్లో(stock market) మళ్లీ ఐపీఓల(IPOs) వారం వచ్చేసింది. దేశంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత ప్రైమరీ మార్కెట్ ఉపశమనం కోసం సిద్ధంగా ఉంది. ఇప్పటికే రెండు కొత్త ప్రారంభ పబ్లిక్ ఆఫర్లు (IPOలు) సబ్స్క్రిప్షన్ కోసం ప్రారంభం కాగా, ఇవి కాకుండా పలు కొత్త IPOలు కూడా సిద్ధంగా ఉన్నాయి.
ఐదో విడత లోక్సభ ఎన్నికల్లో భాగంగా సోమవారంనాడు 49 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుగుతోంది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతానికి 36.73 శాతం పోలింగ్ నమోదైంది. లఢక్లో అత్యధికంగా 52.02 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.
దేశంలో కొత్త, పాత పార్లమెంట్ భవనాల(Parliament Buildings) సెక్యూరిటీ బాధ్యతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)కు అప్పగించారు. ఈ క్రమంలో మే 20వ తేదీ నుంచి 3 వేల 300 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందిని పార్లమెంట్ భద్రతకు వినియోగించనున్నారు.