Home » Ponguleti Srinivasa Reddy
ఖమ్మం జిల్లా: ఖమ్మం రూరల్ మండలం, రెడ్డిపల్లి, పోలేపల్లిలో నిర్వహించిన ప్రజా సమస్యలపై ప్రజల వద్దకే శ్రీనన్న కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రజలనుంచి మంత్రి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.
రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చి పెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు గురువారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంపు డ్యూటీలపై చర్చ జరిగింది. హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల విలువల భారీగా పెరిగాయని, కానీ.. అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు-స్టాంపు డ్యూటీల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని గుర్తించారు.
Telangana: శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం నిలిచిపోయింది. మంగళవారం ఇండిగో 6ఏ 6707 విమానం హైదరాబాద్ నుంచి కొచ్చిన్కు వెళ్లాల్సి ఉంది. అయితే టేకాఫ్ సమయంలో ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం రన్వేపైనే నిలిచిపోయింది. దాదాపు గంట నుంచి టేకాప్ కాకుండా విమానం రన్వపై నిలిచిపోయవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా జలాల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కుట్ర పన్నారని.. అందుకే తన దోస్తు కోసం ఆంధ్ర ప్రాంతానికి ఆ నీటిని వదిలేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతంగా కట్టానని కేసీఆర్ (KCR) చెప్పుకుంటాడని.. కానీ ఆ ప్రాజెక్ట్ నిర్మాణ లోపం కారణంగానే గోదావరి నీళ్లు సముద్రంలో కలవడం లేదా అని ప్రశ్నించారు.
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17సీట్లలో 13సీట్లు కాంగ్రెస్ పార్టీనే గెలవబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటూ రాదన్నారు. 3సీట్లలో బీజేపీతో, ఒక్క సీటులో ఎంఐఎంతో తమకు పోటీ ఉంటుందని తెలిపారు.
‘వెయ్యి గొడ్లను తిన్న రాబందు.. నన్ను ఎవరూ ఏమీ చేయలేరని విర్రవీగి చివరకు ఒక్క గాలి వానకు కొట్టుకుపోయిందన్న చందంగా కేసీఆర్ పరిస్థితి మారింది.
Telangana: పదేళ్ల పాటు దేశాన్ని పరిపాలించిన బీజేపీ తెలంగాణకు చేసింది ఏమి లేదని.. రాష్ట్రానికి ఇచ్చింది ‘‘గాడిద గుడ్డు’’ మాత్రమే అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాముల వారిని కూడా బీజేపీ రాజకీయాల్లోకి తెచ్చిందని విమర్శించారు. తలంబ్రాల పేరుతో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ కలలుకంటోందన్నారు.
Telangana: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఖమ్మంలో ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ.. మతతత్వం రెచ్చగొట్టే బీజేపీకి కానీ, మాయ మాటలు చెప్పే బీఆర్ఎస్కు ఓటు వేయొద్దని కోరారు. రాష్ట్రంలో లక్ష 50 వేల కోట్ల రూపాయలు దోచుకున్న ప్రభుద్దుడు కేసీఆర్ అని ఆరోపించారు.
దేశంలో అతిపెద్ద అవినీతి పార్టీలుగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గుర్తింపు పొందాయని, ఎన్నికల బాండ్ల పేరుతో జరిగిన అవినీతిలోనే ఇది రుజువైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,
మాయమాటలు చెప్పటం తప్పా ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) దేశానికి ఏం చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ప్రశ్నించారు. సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.