Home » Pulivendla
Andhrapradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతికి చేదు అనుభవం ఎదురైంది. స్వయంగా వైసీపీ నేతనే భారతిని నిలదీసిన పరిస్థితి. ఇదంతా జరిగింది కూడా సొంతగడ్డ పులివెందుల నియోజకవర్గంలోనే. పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ పోటోకు సంబంధించి ఈ ఘటన చోటు చేసుకుంది.
వైఎస్ అవినాశ్ ఏ తప్పూ చేయలేదని నేను బలంగా నమ్మాను. కాబట్టే టికెట్ ఇచ్చాను. మాఅందరి కన్నా చిన్నపిల్లాడు అవినాశ్
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు(Assembly Elections) ఇవాళే చివరి రోజు కావడంతో.. చాలా మంది నేతలు ఇవాళ నామినేషన్లు వేస్తున్నారు. గురువారం నాడు పులివెందులలో(Pulivendula) వైసీపీ అభ్యర్థిగా(YSRCP Candidate) ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ నామినేషన్(YS Jagan Nomination) దాఖలు చేయనున్నారు.
కడప: సీఎం జగన్ సొంత అడ్డా పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. వివేక కుమార్తె సునీత అక్క కడప పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి షర్మిలకు అనుకూలంగా ప్రచారం చేస్తున్న ఆమెకు జనం నీరాజనం పలుకుతున్నారు.
కడప జిల్లా అంటే వైయస్ ఫ్యామిలీ.. వైయస్ ఫ్యామిలీ అంటే కడప జిల్లా. అలాంటి జిల్లాలో రాజకీయం ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల.. కడప ఎంపీగా బరిలో దిగారు. దీంతో ప్రచారంలో ఆమె బాణంలా దూసుకు పోతున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ(YCP) అధినేత జగన్కు(YS Jagan) బిగ్ షాక్ ఇచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్యే. పి.గన్నవరం(P.Gannavaram) ఎమ్మెల్యే కొండేటి చిట్టబాబు(Kondeti Chittibabu) వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్(Congress) పార్టీలో చేరారు. పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయన.. నేరుగా జమ్మలమడుగు వచ్చి ..
ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా వైసీపీ (YSRCP) నేతలు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) పలుమార్లు ఏపీ ఎన్నికల సంఘం (Election Commission) దృషికి తీసుకెళ్తుంది.
కడప జిల్లా: వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రపై ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. ‘మేము సిద్ధం అంటే మీరు దేనికి సిద్దం?’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నా రని నేతలు ఆందోళన చెందుతున్నారు.
Andhrapradesh: పులివెందులలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిన్న (సోమవారం) మెడికల్ కాలేజీని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిపై పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి స్పందిస్తూ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... పులివెందులలో మెడికల్ కాలేజీకి కేంద్రం అనుమతి లేదని తెలిపారు. నిర్మాణ దశలో ఉన్న మెడికల్ కాలేజీని సీఎం జగన్ రెడ్డి ప్రారంభించారని విమర్శించారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన సొంతూరు అయిన పులివెందులలో నేడు పర్యటించనున్నారు. పులివెందులలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ క్రమంలోనే గత అర్ధరాత్రి నుంచే పోలీసు బలగాలు పులివెందులను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.