Home » Rains
తిరుమలలో భారీ వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం నుంచి మేఘావృతమైన ఆకాశం.. మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది.
ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది.
హైదరాబాద్(Hyderabad) మహానగరంలో గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్జామ్ ఏర్పడింది. ముఖ్యంగా సాయంత్రం కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేవారు, ఇంటి నుంచి సాయంత్రం కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Weather Alert to AP and TS: ఎండలతో సతమతం అయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు వరణుడు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాడు. ఒక్కసారిగా కురుస్తు్న్న భారీ వర్షాలతో కాస్త చల్లబడుతున్నారు. అయితే, వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు మరో అలర్ట్ జారీ చేసింది. రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడుతాయని ప్రకటించింది.
భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీలోని ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) విభాగం ముందస్తు హెచ్చరికలు జారీచేసింది. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య భారీ వర్షం(Heavy rain) కురిసే అవకాశముందని, ఆ సమయంలో ప్రయాణాలు లేకుండా చూసుకోవాలని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి సూచించారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెట్లు, కొమ్మలు విద్యుత్తు తీగలపై విరిగిపడటంతో పలుచోట్ల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గురువారం మధ్యాహ్నం వరకు నగరంలో ఎర్రటి ఎండలే కాయగా.. 3 గంటల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై భారీ వర్షం పడింది. యూసుఫ్గూడలో 9 సెం.మీ., బంజారాహిల్స్ వెంకటేశ్వరకాలనీ 8.7 సెం.మీ, మలక్పేటలో 8.5, బేగంబజార్లో 8.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్(Hyderabad)లో 6 గంటల తర్వాత మళ్లీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. ఈ క్రమంలో ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్లే వారు వర్షం, ట్రాఫిక్ తీవ్రతను చూసుకుని ప్లాన్ చేసుకొని వెళ్లాలని అధికారులు సూచించారు.
ఐపీఎల్-2024లో భాగంగా.. గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఇది 66వ మ్యాచ్. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా..
హైదరాబాద్(hyderabad)లో దాదాపు గంటపాటు కురిసిన భారీ వర్షానికి (rain) అనేక ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం కావడంతో పలు చోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం కారణంగా నగరంలోని అన్ని ప్రధాన జంక్షన్లలో వాహనాల రద్దీ పెరిగి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.
హైదరాబాద్(Hyderabad Rains)లో కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం సెక్రటేరియట్లోని అన్ని విభాగాల అధికారులతో సీఎం మాట్లాడారు.