Home » Tadepalli Jagan House
అధికారం ఉన్నంత సేపు ఒకరకం.. అధికారం పోతుందంటే మరొక రకంలా తయారైంది ఏపీ సీఎం వైఎస్.జగన్ పరిస్థితి. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా వాస్తుని, ముహుర్తాలను నమ్ముతూ ఉంటారు. కానీ జగన్ గత ఐదేళ్ళలో తనకు నచ్చిందే చేసుకుంటూ వెళ్లారు. వాస్తును అసలు పట్టించుకోలేదు. అది అతని వ్యక్తిగత నిర్ణయం కావచ్చు. అయితే ఐదేళ్ల తర్వాత జగన్లో అధికారం కోల్పోతున్నామనే భయం మొదలైందట.
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిస్తే ఇప్పుడిస్తున్న అమ్మ ఒడి సాయాన్ని పెంచుతామని సీఎం జగన్(CM Jagan) ప్రకటించారు. తాడేపల్లిలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ మాట్లాడారు. వైసీపీ గెలవగానే జగనన్న అమ్మఒడి కింద ఇస్తు్న్న రూ.15 వేలను రూ.17 వేలకు పెంచుతామని ప్రకటించారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలపై సీఎం జగన్ రెడ్డి (CM Jagan) పలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ‘సిద్ధం’ సభలతో మొదటి విడత ప్రచారం పూర్తి చేశారు. ఈ ప్రచారంలో పలువురు వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ - జనసేన - బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తుండటంతో జగన్లో ఓకింత భయం మొదలైంది. ఈ కూటమిని ఎలా ఢీకొట్టాలనే విషయంపై ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో పలు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ఇంచార్జీల మార్పులపై సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఇంచార్జీల మార్పులతో ఐదో జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
YS Sharmila Mets CM YS Jagan Reddy : ఏపీ సీఎం, సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల భేటీ అయిన సంగతి తెలిసిందే. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి వేడుకకు రావాలని జగన్కు శుభలేఖ అందజేశారు. కుమారుడు, కాబోయే కోడలు ప్రియా అట్లూరితో కలిసి తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన షర్మిల.. అరగంట పాటు భేటీ అయ్యారు. జగన్, వదిన భారతీలకు పెళ్లి కార్డు ఇచ్చిన షర్మిల తప్పకుండా రావాలని ఆహ్వానించారు..
YS Sharmila To Meet AP CM YS Jagan : అవును.. మీరు వింటున్నది నిజమే..! ఇన్నిరోజులూ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయన్నారు.. ఏపీ రాజకీయాల్లో జగనన్న వదిలిన బాణమే రివర్స్ కాబోతోందన్నారు..! సడన్గా ఇదేంటబ్బా..? అని అనుకుంటున్నారా..? సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వైఎస్ షర్మిల భేటీ మాత్రమే కాబోతున్నారు...
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరగనున్న విదేశీ విద్యా దీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం కార్యక్రమాల వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొంటారు.
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi).. ఈ పేరు తెలుగు రాష్ట్రాల (Telugu States) ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు.! ఈయన మీడియా ముందుకొచ్చినా సంచలనమే.. ట్వీట్ చేస్తే అంతకుమించి సీన్ ఉంటుంది.! అలాంటిది ఈ మధ్య ఎక్కడా కనిపించట్లేదు.. ఆయన వాయిస్ కూడా వినిపించట్లేదు..!
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీలో నేతల మధ్య విబేధాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో (East Godavari) మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వర్సెస్ ఎంపీ పిల్లి సుభాష్ (Minister Venu Vs MP Pilli) మధ్య ‘రామచంద్రపురం’ (Ramachandrapuram) గొడవ ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న విషయం తెలిసిందే...
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది.