Home » Tadipatri
సార్వత్రిక ఎన్నికల తరువాత అల్లర్లు చెలరేగడం, మరికొన్ని రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల (AP Elections) ముందు.. ఆ తర్వాత జరిగిన అల్లర్లు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 144 సెక్షన్ అమలు చేయడంతో పరిస్థితులు చక్కబడుతున్నాయి. మరోవైపు.. ఈ అల్లర్ల ఘటనపై విచారణ చేసేందుకు తాడిపత్రికి సిట్ అధికారుల బృందం విచ్చేసింది. శాంతిభద్రతల దృష్ట్యా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ను పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దింపారు...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగిన గొడవలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలు రణరంగంగా మారిన పరిస్థితి. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ఎన్నికల కమిషన్ కన్నెర్రజేసి ఆయా జిల్లాల ఎస్పీలు, పలువురు పోలీసు ఉన్నతాధికారులపై వేటు వేసింది.
తాడిపత్రి అల్లర్లను అరికట్టడంలో విఫలమైనందుకు ఎస్పీ అమిత బర్దర్పై సస్పెన్షన వేటు పడింది. తాడిపత్రి నియోజకవర్గ కేంద్రంలో పోలింగ్ రోజు, ఆ తరువాత జరిగిన హింసాత్మక చర్యలను అరికట్టడంలో విఫలమైనందుకు ఎన్నికల కమిషన చర్యలు తీసుకుంది. ఆయనతోపాటు తాడిపత్రి డీఎస్పీ సీఎం గంగయ్య, సీఐ ఎస్.మురళీకృష్ణను సస్పెండ్ చేసింది. తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ వర్గీయులు ...
భారీ భద్రత మధ్య తాడిపత్రిలోని జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని పోలీసులు హుటాహుటిన హైదరాబాద్ తరలించారు.
తాడిపత్రిలో టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని పోలీసులు టార్గెట్ చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆ ఫ్యామిలీ పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
తాడిప్రతి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగలింది. బీఎస్-IV వాహనాల మనీ లాండరింగ్ ప్రభాకర్ రెడ్డిపై ED ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసుకు సంబంధించి 17 మంది నిందితులు, సంస్థలపై ప్రాసిక్యూషన్ ఫిర్యాదును హైదరాబాద్లోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ దాఖలు చేసింది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు నిన్న(సోమవారం) పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే పోలింగ్ సమయంలో వైసీపీ (YSRCP) పలు అల్లర్లు, అరాచకాలు సృష్టించింది. పలు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ మూకలు పెద్దఎత్తున దాడులకు పాల్పడుతున్నాయి. అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో మరోసారి వైసీపీ అల్లరి మూకలు దాడులకు తెగడుతున్నాయి. తాడిపత్రి పట్టణంలో తెలుగుదేశం పార్టీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడులకు పాల్పడ్డారు.
ఎన్నికల ప్రచారంలో సీఎం జగన ‘పేలవ ప్రదర్శన’ కొనసాగుతోంది. వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకువస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, టీడీపీ అధికారంలోకి వస్తే ఆగిపోతాయని జనాన్ని బెదిరించి, లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు. తాడిపత్రి వైఎస్సార్ సర్కిల్లో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చామని అన్నారు. నవరత్నాల్లోని అన్ని పథకాలను అమలు చేశామని అన్నారు. కానీ ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం, పోలవరం ప్రాజెక్ట్, సీపీఎస్ రద్దు, మెగా...
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. నేటి నుంచి తాడిపత్రి నియోజకవర్గంలో బస్సుయాత్ర