Home » Telugu Desam Party
ఏపీ సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) ముగిసిన అనంతరం జరిగిన అల్లర్లపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) దర్యాప్తును ముమ్మరం చేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చెలరేగిన హింసపై సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికల తరువాత అల్లర్లు చెలరేగడం, మరికొన్ని రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల (AP Elections) ముందు.. ఆ తర్వాత జరిగిన అల్లర్లు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 144 సెక్షన్ అమలు చేయడంతో పరిస్థితులు చక్కబడుతున్నాయి. మరోవైపు.. ఈ అల్లర్ల ఘటనపై విచారణ చేసేందుకు తాడిపత్రికి సిట్ అధికారుల బృందం విచ్చేసింది. శాంతిభద్రతల దృష్ట్యా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ను పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దింపారు...
తిరుపతి,తాడిపత్రి, అనంతపురం, పల్నాడు ప్రాంతాల్లో జరిగిన దాడులపై సిట్ ఉన్నత అధికారులకు తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.దాడులకు సంబంధించి వివరాలను సాక్షాధారాలతో సీట్ అధికారులకు అందజేసినట్లు టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య (Varlaramaiah) తెలిపారు. మొత్తం 30 ఘటనలకు సంబంధించిన వివరాలు తమ రిప్రజెంటేషన్లో పొందుపరిచామని చెప్పారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసిన తర్వాత పలు జిల్లాల్లో అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలపై ఎన్నికల కమిషన్ (Election Commission) సీరియస్ అయింది. ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించింది.
నిన్న ఎయిర్ పోర్ట్లో అన్యాయంగా ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేష్ను అరెస్టు చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమ (Devineni UMA) అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై లోకేష్ అభిప్రాయాలు వ్యక్తం చేయడం తప్పా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి అవినీతిపై లోకేష్ తన అభిప్రాయాలు చెప్పారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగిన గొడవలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలు రణరంగంగా మారిన పరిస్థితి. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ఎన్నికల కమిషన్ కన్నెర్రజేసి ఆయా జిల్లాల ఎస్పీలు, పలువురు పోలీసు ఉన్నతాధికారులపై వేటు వేసింది.
రాష్ట్రంలో పోలింగ్ తర్వాత జరిగిన ఘటనలపై ఎన్నికల కమిషన్ (Election Commission) ఆదేశాలు వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ (Kanakamedala Ravindra Kumar) కోరారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరిగిన తర్వాత.. రాష్ట్రంలో పలు అల్లర్లు జరుగుతుండటంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్కు తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఏపీలో శాంతి భద్రతలు, నిధుల వ్యయంపై ఫిర్యాదు చేశారు.