Home » TG News
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెట్లు, కొమ్మలు విద్యుత్తు తీగలపై విరిగిపడటంతో పలుచోట్ల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గురువారం మధ్యాహ్నం వరకు నగరంలో ఎర్రటి ఎండలే కాయగా.. 3 గంటల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై భారీ వర్షం పడింది. యూసుఫ్గూడలో 9 సెం.మీ., బంజారాహిల్స్ వెంకటేశ్వరకాలనీ 8.7 సెం.మీ, మలక్పేటలో 8.5, బేగంబజార్లో 8.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చి పెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు గురువారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంపు డ్యూటీలపై చర్చ జరిగింది. హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల విలువల భారీగా పెరిగాయని, కానీ.. అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు-స్టాంపు డ్యూటీల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని గుర్తించారు.
రాష్ట్రంలో మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం కొనసాగించాలని తెలంగాణ ముదిరాజ్ మహా సంఘం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మృగశిర కార్తె రోజున హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో ‘ఫిష్ ఫెస్టివల్’ నిర్వహించాలని కోరారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన సమావేశంలో సంఘం రాష్ట్ర సమన్వయకర్త బొక్క శ్రీనివాస్ ముదిరాజ్, రాష్ట్ర యూత్ విభాగం అధ్యక్షుడు రంజిత్ ముదిరాజ్ తదితరులతో కలిసి మాట్లాడారు.
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణ పనులను నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టడం, అవసరం లేకున్నా ఛత్తీ్సగఢ్తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడం వంటి కారణాలతో జరిగిన నష్టంపై 10 రోజుల్లోగా (ఈ నెల 16 నుంచి) ఫిర్యాదు చేయాలని జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి కమిషన్ కోరింది. ఈ మేరకు గురువారం బహిరంగ ప్రకటన ఇచ్చింది. పోటీ బిడ్డింగ్ ద్వారా కాకుండా నామినేషన్ ప్రాతిపదికన ఛత్తీ్సగఢ్తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడం, సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ప్లాంట్లు కడుతుండగా..
హైటెక్సిటీకి కూతవేటు దూరంలో ఉన్న ఆ రహదారిపై రాత్రి వేళ రాకపోకలు సాగించాలంటే ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు, ప్రజలకు వణికిపోతున్నారు. చీకటి పండిందంటే చాలు.. మందుబాబుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి.
ఓట్లేసేందుకు రెండు రోజుల ముందుగానే ప్రజలు వెళ్లడంతో నగరంలో వాహనాల రద్దీ కూడా గణనీయంగా తగ్గింది. దీంతో సాధారణ రోజులతో పోల్చితే పోలింగ్ రోజున, ఒక రోజు ముందు, ఒక రోజు తర్వాత వాయు కాలుష్యం తగ్గినట్లుగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.
ఔటర్ రింగ్రోడ్డు(Outer Ring Road)పై ముంపు పొంచి ఉంది. గాలి దుమారం వచ్చినా, భారీ వర్షం కురిసినా విద్యుత్ స్తంభాలు రోడ్డుకు అడ్డుగా పడిపోతున్నాయి. వాహనదారులు గమనించకుంటే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి.
గురువారం జరిగే క్రికెట్ మ్యాచ్కు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) పరిసర ప్రాంతాలకు 60 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ అధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు.
ఐపీఎల్లో ఆరో మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఉప్పల్(Uppal)లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ముస్తాబైంది. గురువారం సాయంత్రం 7.30 గంటలకు గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తలపడనుంది.
వారంతా ఖాకీ యూనిఫాం వేసుకుంటారు..! కానీ, పోలీసు శాఖలో శాశ్వత ఉద్యోగులు కాదు..! కానిస్టేబుళ్లకు దీటుగా బందోబస్తుల్లో.. ట్రాఫిక్ నియంత్రణలో నిలువుకాళ్ల జీతం చేస్తారు..! కానీ, జీతం విషయంలో భారీ వ్యత్యాసం ఉంటుంది. ఇదీ హోంగార్డుల పరిస్థితి..! ఇప్పుడు ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న హోంగార్డులకు కొత్త చిక్కొచ్చిపడింది.