Home » Tirupati
గుంతకల్ డివిజన్ తిరుపతి-కట్పడి సెక్షన్(Tirupati-Katpadi Section)లో ట్రాఫిక్ బ్లాక్ కారణంగా ఈ రూట్లో వెళ్లి వచ్చే పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల తరువాత అల్లర్లు చెలరేగడం, మరికొన్ని రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగిన గొడవలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలు రణరంగంగా మారిన పరిస్థితి. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ఎన్నికల కమిషన్ కన్నెర్రజేసి ఆయా జిల్లాల ఎస్పీలు, పలువురు పోలీసు ఉన్నతాధికారులపై వేటు వేసింది.
ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలు (AP Elections).. ఎన్నికల తర్వాత జరిగిన గొడవలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా తిరుపతి, అనంతపురం, పల్నాడు జిల్లాల్లో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. దాడులు జరిగిన పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో 144 సెక్షన్ పెట్టడంతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి..
చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతి(Chennai Central to Tirupati) వెళ్లే సప్తగిరి ఎక్స్ప్రెస్ రైళ్లు బుధవారం నుంచి ఈ నెల 31వ తేది వరకు తిరుపతికి బదులుగా రేణిగుంట వరకు మాత్రమే వెళతాయని దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
Andhrapradesh: తిరుపతిలోని అలిపిరి వద్ద ఓ కారు మంటలకు ఆహుతైంది. అలిపిరి గరుడా సర్కిల్ వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కారు డ్రైవర్ వాహనాన్ని పక్కక నిలిపివేశారు. డ్రైవర్తో పాటు కారులో నుంచి భక్తులు బయటకు పరుగులు తీశారు.
తిరుపతి: పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వైసీపీ మూకల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. మంగళవారం చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీపై హత్యాయత్నానికి పాల్పడ్డాయి. తిరుపతిలోని పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ ఆవరణలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ను సందర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో వైసీపీ వర్గీయులు ఆయనపై దాడి చేశారు. సుమారు 150 మంది మారణాయుధాలతో దాడి చేయగా నానీ భుజానికి గాయమైంది.
తిరుపతి రణరంగంగా మారింది. ఈవీఎంలు భద్రపరిచిన పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద రెచ్చిపోయిన వైసీసీ గూండాలు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.
Andhrapradesh: తిరుపతిలో ఎంతో వైభవంగా జరిగే తాతయ్యగుంట గంగమ్మ జాతరకు నేడు (మంగళవారం) చాటింపు జరుగనుంది. ఏపీలో జరిగే జాతరలో గంగమ్మ జాతర ఒకటి. తిరుపతి గంగమ్మ జాతరకు ఎంతో విశిష్ట ఉంది. ఏడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. తిరుపతి గ్రామదేవత తాతాయ్యగుంట గంగమ్మకు ప్రతీ ఏటా జాతర చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతీ ఏటా మే నెలలో ఏడు రోజుల పాటు జాతర నిర్వహించటం జరుగుతుంది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు (ap elections 2024) రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని(Tirupati Lok Sabha constituency) ఎస్సీ స్థానం కోసం ఎంత మంది పోటీ చేస్తున్నారనేది ఇక్కడ చుద్దాం.