Home » TS News
Telangana: రాములమ్మ అంటే తెలియని వారు ఉండరు. బీజేపీలో అసంతృప్తితో ఉన్న విజయశాంతి గతేడాదే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్లో రాములమ్మకు కీలక పదవి కూడా లభించింది. పార్టీలో చేరిన 24 గంటల్లోనే క్యాంపెయిన్ అండ్ ప్లానింగ్ కమిటీకి చీఫ్ కో-ఆర్డినేటర్ పదవిని కాంగ్రెస్ కట్టబెట్టింది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్లో ఉంటూనే బీఆర్ఎస్ పార్టీ గురించి విజయశాంతి మాట్లాడటం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
Telangana: వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేస్తున్నా ఫలితాలు రావడం లేదన్నారు. గన్నీ బ్యాగుల విషయంలో కావాలని కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వర్షాలతో కల్లాల్లో ధాన్యం కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
డబ్బు కోసం ఏకంగా భర్త, అత్తపైనే దాడి చేయించిందో మహిళ. అత్తను చంపేస్తే ఇన్స్యూరెన్స్ డబ్బులు వస్తాయని భావించింది. మానవత్వం మరచి.. తన తరుఫు బంధువులను అరేంజ్ చేసి మరీ కొట్టించిన ఘటన స్థానికంగా పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది. బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కట్టేల మండి సమీపంలో భర్త, అత్తపై బంధువులతో భార్య దాడి చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Telangana: ఇక్ఫాయి ఘటనపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. లా విద్యార్థిని లేఖ్య వర్ధిని ఒంటిపై గాయాలపై ఇప్పటికీ స్పష్టత రాని పరిస్థితి. వాష్ రూమ్లో ఏం జరిగింది అనేది ఇప్పటికీ సస్పెన్సే. అసలు ఘటన ఎలా జరిగిందనే దానిపై యూనివర్సిటీ అధికాలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. వేడినీళ్ళ కారణంగానే ఘటన జరిగిందని క్లారిటీ ఇవ్వలేము అంటూనే యాసిడ్ ఎటాక్ను యూనివర్సిటీ అధికారులు తోసిపుచ్చారు.
Telangana: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. శుక్రవారం ఉదయం వివేక హత్య కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి హాజరయ్యారు. అలాగే చంచల్గూడ జైలులో ఉన్న నలుగురు నిందితులను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులు విచారణకు హాజరుపర్చారు.
Telangana: పట్టభద్రుల ఎన్నిక అనేది చాలా ముఖ్యమని వరంగల్ - ఖమ్మం - నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనుముల రాకేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... చదువుకున్న వాళ్ళు, మేధావులు, విద్యావంతులు సమాజానికి ఉపయోగపడే వారిని ఎన్నుకుంటారన్నారు. రెండు సార్లు కేసీఆర్కు అవకాశం ఇచ్చిన ప్రజలు... మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారన్నారు.
హైదరాబాద్లో రాత్రి కురిసిన కుండపోత వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. మలక్పేట్ రైల్వే బ్రిడ్జి కింద పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలిచిపోయింది. బ్రిడ్జి కింద నుంచి పేషెంట్ను తీసుకుని వెళుతున్న అంబులెన్స్ నీటిలో ఆగిపోయింది. బ్రిడ్జి కింద నీరు ఎక్కువగా ఉండడంతో ఇంజిన్లోకి చేరింది. కోదాడ నుంచి ఓ పేషెంట్ను చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా ఘటన చోటు చేసుకుంది.
Telangana: రైతుల కోసం బీఆర్ఎస్ ధర్నాలు చేయడం సిగ్గు చేటని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గత పదేళ్లల్లో రైతులకు ఏం చేశారని ప్రశ్నించారు. రైతులకు సంకెళ్లు వేసింది బీఆర్ఎస్ కాదా అని నిలదీశారు. గజ దొంగల్లా బేడీలు వేశారని.. నేరెళ్ల ఘటన ఎవరి హయాంలో జరిగిందని అన్నారు. రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం గోసపుచ్చుకుందని.. దాన్ని ఎవరు మర్చిపోలేదన్నారు.
Telangana: రైతుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రైతులు అనేక రకాలుగా పంటనష్టపోయారన్నారు. నష్టపోయిన రైతులకు ఆదుకుంటామని మొక్కుబడిగా చెప్పిన ప్రభుత్వం ఆ తరువాత పట్టించుకోలేదన్నారు. అనేక మండలాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభించలేదన్నారు.
Telangana: మాజీ సీఎం కేసీఆర్ చేస్తున్న కామెంట్స్పై కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి స్పందించారు. పద్మశాలిలు నిరోద్లు అమ్ముకోవాలంటూ తాను వ్యాఖ్యలు చేసినట్లుగా కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పద్మశాలిలను అనలేదనీ, ఒక వ్యక్తితో వేరే సందర్బంలో మాట్లాడిన వాటిని కట్అండ్ పేస్ట్ చేసి వైరల్ చేశారని తెలిపారు.