Home » TSRTC
గురువారం జరిగే క్రికెట్ మ్యాచ్కు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) పరిసర ప్రాంతాలకు 60 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ అధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు.
త రెండు రోజుల్లో టీఎ్సఆర్టీసీ బస్సుల్లో రికార్డుస్థాయిలో 1.50 కోట్ల మంది రాకపోకలు సాగించారని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఆయన సోమవారం కొండాపూర్ చిరాక్ పబ్లిక్ స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటేయడానికి స్వగ్రామాలకు వెళ్లిన వారికి తిరుగు ప్రయాణంలోనూ అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Andhrapradesh: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్కు ఇప్పటి వరకు 590 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశామన్నారు.
భవితకు దారి చూపించే ఓటు హక్కును వినియోగించుకోవడానికి జనం ఊరి బాట పడుతున్నారు. ప్రభుత్వాల ఏర్పాటులో భాగమయ్యేందుకు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బాధ్యతగా కదులుతున్నారు. విద్య, ఉపాధి, ఇతర అవసరాల కోసం ఏ ప్రాంతంలో ఉంటున్నా.. ఓటు వేసి.. ప్రజాస్వామాన్ని బలపరిచేందుకు సొంతూళ్లకు పయనమవుతున్నారు.
Telangana: మే 13న పోలింగ్, వరుసగా మూడు రోజులు సెలవులు. ఇంకేముంది ప్రజలంతా సొంతూళ్ల బాట పట్టారు. వీకెండ్తో పాటు సోమవారం పోలింగ్ నేపథ్యంలో తెలుగు ప్రజలు పల్లెలకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో బస్టాండ్లకు చేరుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది వెళ్లిపోగా.. మరికొందరు ఈరోజు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఎంజీబీఎస్ వద్ద సొంతూళ్లకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్న వారితో బస్టాండ్ కిక్కిరిసి పోయింది.
Telangana: భాగ్యనగరం ఖాళీ అవుతోంది. ఓట్లు వేసేందుకు తెలుగు ప్రజలు తమ తమ సొంతూర్లకు తరలివెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరం సగానికి పైగా ఖాళీ అవుతున్న పరిస్థితి. సొంతూర్లకు వెళ్లేందుకు ప్రజలు బస్టాండ్లకు తరలివెళ్తున్నారు. దీంతో జేబీఎస్ బస్టాండ్ వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది.
సహజంగా.. పెద్ద పండుగైన సంక్రాంతికి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంటుంది. ఏపీ ప్రజలు సొంత రాష్ట్రానికి వెళ్లే క్రమంలో వాహనాలతో ఈ మార్గం కిటకిటలాడుతుంటుంది. కానీ, ఏ పండుగా లేకున్నా.. ఇప్పుడు అలాంటి సందడే కనిపిస్తోంది. ఓట్ల పండుగకు ఏపీ వాసులు సొంత ప్రాంతానికి పయనం కావడమే దీనికి కారణం.
దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకుల కోసం టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఎక్కవు దూరం ప్రయాణించే ప్రయాణీకులు 8రోజుల ముందుగానే అడ్వాన్స్ రిజర్వేజన్ చేసుకుంటే రిజర్వేషన్ ఫీజుఉండదని ప్రకటించింది. ఈ విషయాన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ పోస్టులో తెలిపారు. రిజర్వేషన్ ఫీజు తీసుకోకపోవడం వల్ల ప్రయాణీకుడికి కొంత సొమ్ము ఆదా కానుంది. వాస్తవానికి దూరప్రాంతాలకు ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో వెళ్లాలనుకుంటే ముందుగానే రిజర్వేషన్లు చేసుకుంటారు. దీనికోసం రిజర్వేషన్ ఛార్జీలు వసూలు చేస్తారు.
మంట పుట్టిస్తున్న ఎండలతో గ్రేటర్లో సిటీ బస్సులు(City buses) నడపలేక ఆర్టీసీ డ్రైవర్లు చెమటలు కక్కుతున్నారు. వారం రోజులుగా నమోదవుతున్న రికార్డుస్థాయి పగటి ఉష్ణోగ్రతలతో సిటీ బస్సుల్లో గంటలకొద్దీ డ్రైవింగ్ సీట్లో కూర్చోలేక డ్రైవర్లు చుక్కలు చూస్తున్నారు.
TSRTC - Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్(Hyderabad Metro), తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు(TSRTC) కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రయాణుకుల సౌకర్యార్థం మెట్రో ట్రైన్ టైమింగ్స్.. బస్సులు(Buses) నడిపే సమయాన్ని పెంచారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఐపీఎల్(IPL 2024) సీజన్ 17లో భాగంగా..