Home » Uttam Kumar Reddy Nalamada
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల స్థితిగతులపై ఏకకాలంలో మూడు కేంద్ర సంస్థలతో అధ్యయనం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మేడిగడ్డ బ్యారేజీని ఢిల్లీకి చెందిన కేంద్ర మృత్తిక, ఇతర భూపదార్థాల పరిశోధన కేంద్రం(సీఎ్సఎంఆర్ఎ్స)తో, అన్నారం బ్యారేజీని పుణెలోని కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ(సీడబ్ల్యూపీఆర్ఎ్స)తో, సుందిళ్ల బ్యారేజీని హైదరాబాద్లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఏ)తో అధ్యయనం చేయించనున్నారు.
నాలుగు నెలల కాలంలోనే రాష్ట్రానికి సుమారు 20వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ఒప్పందాలు జరిగాయని, వచ్చే నాలుగేళ్లలో వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా అందాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని తప్పనిసరిగా గెలిపించాల్సిన అవసరం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రె్సను గెలిపిస్తే.. కేంద్రం గ్రామ పంచాయతీలకు విడుదల చేసే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించే ప్రమాదం ఉందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Telangana: కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ బోగస్ ప్రభుత్వంగా మారిపోయిందని విమర్శలు గుప్పించారు. వడ్లు కొనుగోలులో సీఎం రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు. ఎప్పుడు పడిపోతుందో..
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా రాయ్ బరేలికి క్యూ కట్టారు. రాహుల్ గాంధీ రాయ్ బరేలి నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. రేపు లేదా ఎల్లుండి రాయ్ బరేలిలో ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. తెలంగాణ ఎన్నికలు ముగిసినందున రాయ్ బరేలిలో ప్రచారానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లారు.
Telangana: ‘‘ప్రభుత్వాన్ని కాపాడుకునే సత్తా మాకుంది. మేం 11 మందిమి మంచి టీమ్గా పని చేస్తున్నాం. మా ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందేమీ లేదు. రేవంత్ సీఎంగా, భట్టి డిప్యూటీ సీఎంగా, మేం మంత్రులుగా కలిసి పనిచేస్తున్నాం. మేమంతా క్రికెట్ టీంలా పనిచేస్తున్నాం’’ అని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ వ్యవస్థను మోదీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని విమర్శించారు.
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17సీట్లలో 13సీట్లు కాంగ్రెస్ పార్టీనే గెలవబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటూ రాదన్నారు. 3సీట్లలో బీజేపీతో, ఒక్క సీటులో ఎంఐఎంతో తమకు పోటీ ఉంటుందని తెలిపారు.
Telangana: తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శంకరమ్మకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు. శంకరమ్మ కుటుంబం రాష్ట్రానికి చేసిన త్యాగం కాంగ్రెస్ పార్టీ మరవదని మంత్రి తెలిపారు. గురువారం శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గాంధీభవన్లో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ లోక్ సభ సీట్లను గెలుచుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 17 స్థానాల్లో కనీసం 14 సీట్లు గెలుస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రజల విశ్వాసం కోల్పోయారని గుర్తుచేశారు.
Telangana: జస్టిస్ చంద్ర గోష్ కమిషన్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. నేటి నుంచి బ్యారేజీలపై కమిషన్ విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలో మొదటిరోజు కావడంతో కమిషన్ను మంత్రి ఉత్తమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్ర గోష్ కమిషన్కు కాళేశ్వరం అంశాలను వివరించారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కమిషన్ను మంత్రి విజ్ఞప్తి చేశారు.