Home » Vallabhaneni Vamsi Mohan
ప్రజలిచ్చిన విరాళాలతో పోటీచేసి గెలిచిన పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానుభావులు ఏలిన నియోజకవర్గమది. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు డబ్బే ప్రధానమైంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నగదు వెదజల్లాయి. ఒక ఓటు సుమారు రూ.3 వేల వరకూ పలికిందంటే ఈ నియోజకవర్గం ఎంత ఖరీదైందో తెలుస్తుంది.
అంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరుగుతున్న పోలింగ్ వేళ.. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ వెంకట్రావు విజయం ఖాయమైందని అందరికి అర్థమైపోయింది. ఆ క్రమంలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి వల్లభనేని వంశీ అనుచరులు రెచ్చిపోయారు. సురంపల్లిలోని పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ పరిశీలిస్తున్న యార్లగడ వెంకట్రావుపై వారు దాడికి పాల్పడ్డారు.
‘వచ్చే ఎన్నికల్లో దుట్టా రామచంద్రరావు కూతురు సీతామహాలక్ష్మి వైసీపీ తరఫున పోటీలో ఉంటారు. ఆమెకు మేము సపోర్టు చేస్తాం. రాజకీయాల్లో ఉన్నా లేకున్నా, గతంలో ఏ రకంగా అయితే విజయవాడ పార్లమెంటుకు పోటీచేసి ఓడిపోయినా మా అమ్మ పేరుతో చారిటబుల్ ట్రస్టు పెట్టి గన్నవరంలో ఏ విధంగానైతే సేవలు చేశామో అవన్నీ కొనసాగుతాయి.’
ఇది వరకు ఎవరిని ఏదైనా మాట అంటే.. కొండను తిరిగి వచ్చి అన్నవారికి తగిలేవి. కానీ ప్రస్తుతం అలా లేదు. నేడు ఎవరిని ఏదైనా అంటే.. నీళ్ల కుండను తిరిగి వచ్చినంత ఈజీగా అన్నవారికి వచ్చి తగులుతుంది. అందుకు అత్యుత్తమ ఉదాహరణ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఏప్రిల్ 25వ తేదీ నామినేషన్ ప్రక్రియకు తుది రోజు. ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్ వేసేందుకు గన్నవరంలో ర్యాలీ నిర్వహించారు.
ఏపీ సార్వత్రిక ఎన్నిక (AP Election 2024)ల్లో భాగంగా ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల నుంచి నామినేషన్లు స్వీకరిస్తుంది. ఈ నామినేషన్ వేసేందుకు తెలుగుదేశం (Telugu Desam Party), వైఎస్సార్సీపీ (YSRCP) అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గన్నవరం నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు, వైఎస్సార్సీపీ నుంచి వల్లభనేని వంశీ పోటీచేస్తున్నారు.
నిన్ను రైటు అనుకుంది నేడు రాంగ్ అవుతుంది... నేడు రాంగ్ అనుకున్నది రేపు రైట్ అవుతుంది. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం, గన్నవరం నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థుల విషయం ఇదే జరుగుతుందని ఓ చర్చ అయితే వాడి వేడిగా సాగుతోంది.
టీడీపీ తనకు టికెట్ కేటాయించకపోవడం పట్ల మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే తనపై వస్తున్న ఆరోపణలపై నేడు ఆయన స్పందించారు. మీడియాతో బోడె ప్రసాద్ మాట్లాడుతూ.. కొడాలి నాని, వల్లభనేని వంశీతో తనకు ఎటువంటి సంబంధాలు లేవని.. పట్టాభిపై, పార్టీ కార్యాలయంపై దాడి ప్రయత్నాలు చేస్తున్నారని ముందే చెప్పానన్నారు.
త్వరలో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలుకెళ్లడం ఖాయమని గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkata Rao) వార్నింగ్ ఇచ్చారు. గురువారం నాడు విజయవాడ రూరల్ రామవరప్పాడులో తెలుగుదేశం కార్యాలయాన్ని ప్రారంభించారు.
టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు నిరసన దీక్ష వద్ద వైసీపీ నేత వల్లభనేని వంశీ హై డ్రామాకు తెరదీశారు. సీసీ టీవీ ఫుటేజ్ సాక్షిగా వంశీ కాన్వాయ్ విజువల్స్ దొరికిపోయాయి. నిన్న టీడీపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా ఎనికపాడులో యార్లగడ్డ దీక్షకు దిగారు. అక్కడకు వల్లభనేని వంశీ వచ్చారు. అయితే పోలీస్లతో ముందుగా మాట్లాడుకొనే వంశీ వచ్చారని టీడీపీ నేతలు చెబుతున్నారు
వైసీపీ నేతల అరాచకాలకు అడ్డు కట్ట వేయడంలో పోలీసులు విఫలమయ్యారని గన్నవరం టీడీపీ ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. కొంతమంది పోలీసులు ఖాకీ యూనిఫాం వేసుకుని వైసీపీ కార్యకర్తల్లాగా పని చేస్తున్నారన్నారు. పోలీసులు తమ పార్టీ నేతల ఇళ్లకు వెళ్లి బెదిరిస్తున్నారని తెలిపారు.