రాజౌరీ ఎన్‌కౌంటర్‌: జేసీఓ సహా ఐదుగురు సైనికుల వీరమరణం

ABN , First Publish Date - 2021-10-11T20:33:26+05:30 IST

జమ్మూకశ్మీర్‌‌లోని రాజౌరీ సెక్టార్‌లో సోమవారం ఉదయం ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు

రాజౌరీ ఎన్‌కౌంటర్‌: జేసీఓ సహా ఐదుగురు సైనికుల వీరమరణం

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌‌లోని రాజౌరీ సెక్టార్‌లో సోమవారం ఉదయం ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. వీరిలో ఒక జూనియర్ కమిషన్డ్ అధికారి (జేసీఓ) కూడా ఉన్నారు. పీర్ పంజల్ రేంజ్‌లో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను తిప్పికొట్టే  సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సైన్యం అప్రమత్తమై ఎదురుకాల్పులు జరిగింది. పూజ్ జిల్లా సురన్‌కొటేలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే నిఘావర్గాల సమాచారంతో భారత బలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఆ క్రమంలోనే ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సైన్యం ఎదురుకాల్పులకు దిగింది. ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదాలెవరైనా మరణించారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Updated Date - 2021-10-11T20:33:26+05:30 IST