YS sharmila ప్రజాప్రస్థానం పాదయాత్రపై సస్పెన్స్
ABN , First Publish Date - 2021-11-10T15:20:13+05:30 IST
ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రపై సస్పెన్స్ కొనసాగుతోంది.
నల్లగొండ: ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పాదయాత్ర కొనసాగింపుపై సందిగ్ధత నెలకొంది. పాదయాత్రను కొనసాగించడమా లేక వాయిదా వేయాలా అనే దానిపై కోర్ టీంతో షర్మిల చర్చలు నిర్వహించారు. మరికాసేపట్లో పాదయాత్రపై షర్మిల ప్రకటన చేయనున్నారు.