1 నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం

ABN , First Publish Date - 2022-06-25T06:20:56+05:30 IST

వచ్చే నెల 1వ తేదీ నుంచి చిత్తూరు ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజనాన్ని పెడుతున్నట్లు సీడీపీవో షానజ్‌బేగం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

1 నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో   మధ్యాహ్న భోజనం

చిత్తూరు, జూన్‌ 24: వచ్చే నెల 1వ తేదీ నుంచి చిత్తూరు ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజనాన్ని పెడుతున్నట్లు సీడీపీవో షానజ్‌బేగం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు ప్రాజెక్టు పరిధిలో  చిత్తూరు, గుడిపాల, యాదమరి, చిత్తూరు మున్సిపాలిటీ ఉన్నాయన్నారు.ఇందులో 1936 మంది గర్భిణులు, 1864 మంది బాలింతలు లబ్ధిదారులుగా ఉన్నారన్నారు. వీరికి వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం ద్వారా పాలు, గుడ్డుతో పాటు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తామని చెప్పారు.

Updated Date - 2022-06-25T06:20:56+05:30 IST