ఆటో బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా..

ABN , First Publish Date - 2022-06-30T16:12:35+05:30 IST

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద విద్యుత్‌ వైర్లు తాకి ఆటో ప్రమాదానికి గురైన ఘటనలో

ఆటో బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా..

Amaravathi : శ్రీ సత్యసాయి(Sri Satyasai) జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద విద్యుత్‌ వైర్లు తాకి ఆటో ప్రమాదానికి గురైన ఘటనలో ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌(YS Jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పారిస్‌(Paris) పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ఘటన వివరాలను సీఎంఓ(CMO) అధికారులు తెలియజేశారు. ఆటో ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం(AP Government) రూ.10లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ మేరకు అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

Updated Date - 2022-06-30T16:12:35+05:30 IST