రోడ్డుపై అడుక్కుంటున్న పిల్లలు.. బిస్కెట్ ప్యాకెట్కు బదులు పొరపాటున 10 తులాల బంగారం ఉన్న బ్యాగ్ను ఇచ్చిందో మహిళ.. చివరకు..
ABN , First Publish Date - 2022-06-17T20:47:23+05:30 IST
ఆ మహిళ తన నగలను బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బు తీసుకుందామని బయల్దేరింది..
ఆ మహిళ తన నగలను బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బు తీసుకుందామని బయల్దేరింది.. రోడ్డు మీద ఆకలితో ఉన్న పిల్లలను చూసింది.. తన బ్యాగులో ఉన్న ఫుడ్ ప్యాకెట్ తీసి పిల్లలకు పంచిపెట్టి బ్యాంకుకు బయలుదేరింది.. బ్యాంకుకు వెళ్లి బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా అందులో బంగారం ఉన్న కవర్ కనిపించలేదు.. ఫుడ్ ప్యాకెట్తో పాటు ఆ కవర్ను కూడా పిల్లలకు ఇచ్చేసినట్టు ఆమెకు అర్థమైంది.. తిరిగి అక్కడకు వెళ్లి చూడగా పిల్లలు కనిపించలేదు.. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి మొత్తం విషయం చెప్పింది.. చివరకు పోలీసులు ఆ బంగారాన్ని కనిపెట్టి ఆ మహిళకు అప్పగించారు.
ఇది కూడా చదవండి..
ఒక్క కొడుకైనా ఉంటే బాగుండేదని తల్లిదండ్రులు ఏడవటం చూసి పెద్ద కూతురు షాకింగ్ నిర్ణయం.. లింగమార్పిడి చేసుకుంది కానీ..
ముంబైలోని దిండోషి ప్రాంతంలో నివాసం ఉంటున్న సుందరి ప్లానిబెల్ అనే మహిళ తన కూతురి పెళ్లి కోసం తీసుకున్న అప్పు చెల్లించేందుకు నగలను బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవాలనుకుంది. దారిలో రోడ్డు మీద ఆమెకు ఆకలితో ఉన్న పిల్లలు కనిపించారు. వెంటనే తన బ్యాగులోంచి ఫుడ్ ప్యాకెట్ తీసి పిల్లలకు పంచిపెట్టి బ్యాంకుకు బయలుదేరింది. బ్యాంకుకు వెళ్లి బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా అందులో బంగారం ఉన్న కవర్ కనిపించలేదు. ఫుడ్ ప్యాకెట్తో పాటు ఆ కవర్ను కూడా పిల్లలకు ఇచ్చేసినట్టు ఆమెకు అర్థమైంది. తిరిగి అక్కడకు వెళ్లి చూడగా పిల్లలు కనిపించలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి మొత్తం విషయం చెప్పింది. పోలీసులు ఆ స్పాట్లో అమర్చిన సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు.
ఆ మహిళ నుంచి ఫుడ్ ప్యాకెట్ తీసుకున్న చిన్నారులు బంగారం ఉన్న కవర్ను చెత్తగా భావించి డస్ట్బిన్లో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆహారం వెతుక్కుంటూ ఆ డస్ట్బిన్లోకి కొన్ని ఎలుకలు వెళ్లాయి. ఆ నగల కవర్ను కొంతదూరం తీసుకెళ్లాయి. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని నగల బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. ఆ నగల బ్యాగును సుందరికి తిరిగి అప్పగించారు.