Kashmir లో 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు

ABN , First Publish Date - 2022-06-13T21:12:03+05:30 IST

ఈ ఏడాది 2022 ఆరంభం ఇప్పటివరకు జమ్ముకాశ్మీర్‌(Jammu and Kashmir )లో 100 మంది ఉగ్రవాదుల(Terrorists )ను భద్రతా బలగాలు అంతమొందించాయి.

Kashmir లో 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు

శ్రీనగర్ : ఈ ఏడాది 2022 ఆరంభం ఇప్పటివరకు జమ్ముకాశ్మీర్‌(Jammu and Kashmir )లో 100 మంది ఉగ్రవాదుల(Terrorists )ను భద్రతా బలగాలు అంతమొందించాయి. వేర్వేరు ఎన్‌కౌంటర్ ఆపరేషన్లలో ఆటంకవాదులను తుదముట్టించినట్టు అధికారులు సోమవారం వెల్లడించారు. మృత్యువాతపడ్డ టెర్రరిస్టుల్లో అత్యధికంగా 63 మంది నిషేధిత లష్కేర్ తోయిబా(Lashkar-e-Taiba)కు చెందినవారు కాగా జేషే మొహమ్మద్‌(Jaish-e-Mohammed) ఉగ్రసంస్థకు చెందిన 24 మంది టెర్రరిస్టులు ఈ జాబితాలో ఉన్నారని అధికారులు వెల్లడించారు. వేర్వేరు ఆపరేషన్లలో చనిపోయిన ముష్కరుల్లో విదేశాలకు చెందినవారి సంఖ్య 29గా ఉంది. నిరుడు ఇదే 6 నెలల కాలవ్యవధిలో హతమైన ఉగ్రవాదుల సంఖ్యతో పోల్చితే ఈ ఏడాది చనిపోయినవారి సంఖ్య రెట్టింపుగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది ఇదేకాల వ్యవధిలో 50 మంది ఉగ్రవాదులను చంపేయగా అందులో ఒక విదేశీ టెర్రరిస్టు ఉన్నాడని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2022-06-13T21:12:03+05:30 IST