గల్ఫ్‌లో వేలాది యాచకుల అరెస్టు.. మక్కాలో మహిళ నుంచి రూ.24 లక్షలు స్వాధీనం

ABN , First Publish Date - 2022-05-11T13:23:09+05:30 IST

దుబాయిలో గత మూడు నెలల్లో 1000 మంది యాచకులను అరెస్టు చేసినట్లు అక్కడి పోలీసులు ప్రకటించారు.

గల్ఫ్‌లో వేలాది యాచకుల అరెస్టు.. మక్కాలో మహిళ నుంచి రూ.24 లక్షలు స్వాధీనం

(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దుబాయిలో గత మూడు నెలల్లో 1000 మంది యాచకులను అరెస్టు చేసినట్లు అక్కడి పోలీసులు ప్రకటించారు. అరెస్టయిన వారిలో అత్యధికులు పవిత్ర రంజాన్‌ మాసంలో, ఈద్‌ పండుగ రోజు భిక్షాటన చేస్తున్న వారేనని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో 902 మంది పురుషులు, 98 మంది మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు. నగరంలో భిక్షాటన చేస్తున్న వారు కనిపిస్తే 901 నెంబరుకు ఫోన్‌ చేయాలని పోలీసులు సూచించారు. రంజాన్‌ మాసంలో అరెస్టు చేసిన ఒక యాచకుడి వద్ద నుంచి 40 వేల దిర్హంలు (సుమారు రూ.8.4 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు. సౌదీ అరేబియాలోనూ భిక్షాటన చేస్తున్న 3,719 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మక్కా పుణ్యక్షేత్రం వద్ద ఒక మహిళ నుంచి రూ.24 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కువైత్‌లోనూ పిల్లలతో సహా భిక్షాటన చేస్తున్న వందలాది మంది విదేశీయులను అరెస్టు చేసి దేశ బహిష్కార దండన విధించారు.

Read more