ఏపీలో కొత్తగా 1,002 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-08-23T23:20:57+05:30 IST
రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల
అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 1,002 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 12 మంది మరణించారు. ఏపీలో మొత్తం 20,03,342 కరోనా కేసులు ఉన్నాయి. కరోనాతో మొత్తం 13,735 మంది మృతి చెందారు. ఏపీలో 14,159 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 19,75,448 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో గత 24 గంటల్లో 47,972 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనాతో చిత్తూరు జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. ఏపీలో కరోనా నుంచి 1,508 మంది బాధితులు కోలుకున్నారు.