103 మందికి కరోనా
ABN , First Publish Date - 2020-11-29T06:21:08+05:30 IST
103 మందికి కరోనా
ఇద్దరు మృతి
242 మంది డిశ్చార్జి
విజయవాడ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా వ్యాప్తి నిలకడగా సాగుతోంది. శుక్రవారం జిల్లాలో 102 పాజిటివ్ కేసులు నమోదు కాగా, శనివారం 103 మందికి వైరస్ సోకింది. కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు మృతిచెందారు. కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 45,257కు చేరాయి. మరణాలు అధికారికంగా 634కు పెరిగాయి. 24 గంటల్లో 242 మంది వ్యాధి నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి ఇంటికి చేరుకున్నారు. ఇంకా 1,530 మంది చికిత్స పొందుతున్నారు.